Padma Awards 2023 : సంగీత దర్శకుడు కీరవాణికి పద్మశ్రీ

  • IndiaGlitz, [Thursday,January 26 2023]

రిపబ్లిక్ డేను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. వీరిలో 91 మందికి పద్మశ్రీ, ఆరుగురికి పద్మ విభూషణ్, తొమ్మిది మందికి పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి 12 మంది ప్రముఖులకు పద్మ అవార్డ్‌లు దక్కాయి. ఇక సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ పురస్కారం దక్కడం విశేషం. వీరి కుటుంబం నుంచి ఆయన సోదరుడు, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి ఇప్పటికే పద్మశ్రీ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే.

తెలుగు పద్మాలు వీరే:

ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి, కమలేశ్ డీ పటేల్‌లకు పద్మభూషణ్.. మోదడుగు విజయ్ గుప్తా, పసుపులేని హనుమంతరావు, బీ రామకృష్ణారెడ్డి, గణేశ్ నాగప్ప, అబ్బారెడ్డి నాగేశ్వరరావు, సీవీ రాజు, కోట సచ్చిదానంద శాస్త్రి, సంకురాత్రి చంద్రశేఖర్, ప్రకాశ్ చంద్రసూద్‌లకు పద్మశ్రీ అవార్డ్ దక్కింది.

ఇటీవలే కీరవాణికి గోల్డెన్ గ్లోబ్:

కాగా.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన సోదరుడు , సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో కలిసి టాలీవుడ్‌ని మరో మెట్టెక్కించిన సంగతి తెలిసిందే.జక్కన్న దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ చిత్రంలోని ‘‘నాటు నాటు’’ పాటకు ప్రపంచ ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వరించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటుకు ఈ పురస్కారం దక్కింది. దీంతో టాలీవుడ్ సంబరాల్లో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ టీమ్‌కి, దర్శకుడు కీరవాణికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రపంచ వేదికపై ఈ అవార్డ్‌ను అందుకుని కీరవాణి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు.

More News

Balakrishna: బాలయ్య మాటలు తప్పుగా అనిపించలేదు.. విషయాన్ని సాగదీయొద్దు : ఎస్వీఆర్ వారసుల విజ్ఞప్తి

‘‘వీరసింహారెడ్డి’’ సక్సెస్ మీట్‌లో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.

Agni Nakshatram: పోస్ట్ ప్రొడక్షన్ దశలో 'అగ్ని నక్షత్రం'

లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'అగ్ని నక్షత్రం'.

Pawan Kalyan : ఏపీలో అడుగుపెట్టిన ‘‘వారాహి’’.. దుర్గమ్మ ఆశీస్సులు పొందిన పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాష్ట్ర వ్యాప్త పర్యటనల కోసం సిద్ధం చేసిన ‘‘వారాహి’’ ప్రచార రథం ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టింది.

Sharwanand: బ్యాచిలర్ లైఫ్‌కి ఫుల్ స్టాప్.. ఇంటివాడు కాబోతున్న శర్వానంద్, అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే షాకే

భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా వున్న నటీనటులు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే.

Vijay Antony : నేను బాగానే వున్నా.. హాస్పిటల్ బెడ్‌పై నుంచే విజయ్ ఆంటోనీ ట్వీట్

బిచ్చగాడుతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విజయ్ ఆంటోనీ ఇటీవల షూటింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే.