చెర్రీతో పాటు హృతిక్ పేరిట ఉన్న రికార్డ్‌ను సైతం బ్రేక్ చేసిన వైష్ణవ్

  • IndiaGlitz, [Thursday,February 18 2021]

హీరో వైష్ణవ్ తేజ్ తన డెబ్యూ సినిమాతోనే స్టార్ హీరోల రికార్డులను బ్రేక్ చేస్తున్నారు. వైష్ణవ్ హీరోగా రూపొందిన ‘ఉప్పెన’ చిత్రం ఈ నెల 12న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 14 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రికార్డ్‌ని వైష్ణవ్ బీట్ చేసేశాడు. అంతే కాదు.. 21 సంవత్సరాల క్రితం బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ క్రియేట్ చేసిన రికార్డును ఇప్పటి వరకూ ఏ ఇండస్ట్రీకి చెందిన డెబ్యూ హీరో కూడా టచ్ చేయలేకపోయారు. ఇది కూడా ఒక్క వైష్ణవ్‌కే సాధ్యమైంది.

హృతిక్‌ రోషన్‌ హీరోగా పరిచయమైన చిత్రం 'కహో నా ప్యార్ హై'. ఈ చిత్రం అప్పట్లో 5 రోజుల్లో 42 కోట్ల నెట్‌ వసూల్‌ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 'కహో నా ప్యార్ హై' సినిమా వచ్చి 21 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటి వరకూ హృతిక్ పేరిటే ఆ రికార్డ్ ఉంది. కానీ తాజాగా.. వైష్ణవ్‌ తేజ్‌ నటించిన ‘ఉప్పెన’ 5 రోజుల్లో 43 కోట్ల నెట్‌ వసూల్‌ సాధించి.. చరిత్ర సృష్టించింది. దీంతో హృతిక్ 21 ఏళ్ల రికార్డ్‌ను బీట్ చేసి.. వైష్ణవ్‌ ఆ రికార్డ్‌పై తన పేరును రాశాడు. అలాగే ‘చిరుత’ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

డెబ్యూ హీరోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా టాలీవుడ్‌లో రామ్ చరణ్ ‘చిరుత’ ఇప్పటి వరకూ ఉంది. సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2007లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో 25 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే మూడు రోజుల్లో ‘ఉప్పెన’ 28 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. 14 సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఉన్న ‘చిరుత’ రికార్డ్‌ని వైష్ణవ్‌ మూడు రోజుల్లోనే బ్రేక్ చేసేశాడు. ఇప్పటికీ ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు రాబడుతూనే ఉంది. ఇక వీకెండ్ కూడా వచ్చేస్తోంది. దీంతో ‘ఉప్పెన’ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

More News

విజయ్‌ సేతుపతిలా చేయడానికి సిద్ధం.. కాకపోతే..: అల్లరి నరేష్

‘అల్లరి’ నరేష్ సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది కామెడీ. జూనియర్ రాజేంద్రప్రసాద్‌లా పేరు తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం రూటు మార్చేశాడు.

'పాగ‌ల్' టీజ‌ర్ విడుద‌ల‌

టాలెంటెడ్ యంగ్ హీరో విష్వ‌క్ సేన్ మునుప‌టి సినిమా హిట్ మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్ట‌యింది. ఆయ‌న న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'పాగ‌ల్'‌.

అయోధ్య రామమందిరానికి వెండి ఇటుకలు పంపొద్దు: తీర్థక్షేత్ర ట్రస్ట్

అయోధ్య రామ మందిరం నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. రామ మందిరం నిర్మాణానికి తమ వంతు సాయం అందించాలని భావిస్తున్న భక్తులు ధనం లేదంటే వెండి ఇటుకలనో ఎంచుకుంటున్నారు.

హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హైకోర్టు న్యాయవాది దంపతులను సుమారు వంద మంది చూస్తుండగానే విచక్షణారహితంగా నరికి చంపేశారు.

నిర్మాతగా రవితేజ.. నిజమెంతో..?

మాస్ మ‌హారాజ ర‌వితేజ‌. నేటిత‌రం యువ హీరోలు చాలా మందికి ఇన్‌స్పిరేష‌న్‌. ఎలాంటి స‌పోర్ట్ లేకుండా అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేసిన ర‌వితేజ త‌ర్వాత న‌టుడిగా మారడం,