పేపర్ బాయ్ సినిమా చిత్రీకరణ పూర్తి

  • IndiaGlitz, [Tuesday,June 19 2018]

సంపత్ నంది టీమ్‌వర్క్స్‌, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్ సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన సినిమా ‘పేపర్ బాయ్’. సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహించారు. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందించబడుతోంది. హైదరాబాద్, ముంబాయి, లోనవాల, పూణే, కేరళ, గోవా వంటి నగరాల్లో ఈ సినిమా తెరకెక్కింది. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని జులై లో విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. డైరెక్టర్ సంపత్ నంది పుట్టినరోజు సంధర్బంగా జూన్ 20న పేపర్ బాయ్ ఫస్ట్ లుక్ ను విడుదల కానుంది.