పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. వైసీపీ ఎంపీకి షాక్..

  • IndiaGlitz, [Monday,September 14 2020]

పార్లమెంటు సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఎంపీలంతా ఢిల్లీ చేరుకున్నారు. వీరికి పార్లమెంట్ సచివాలయంలో ముందుగానే కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షల్లో వైసీపీ ఎంపీకి షాక్ తగిలింది. ఏమాత్రం కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనకు అధికారులు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. మరోవైపు కాకినాడ ఎంపీ వంగా గీతకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

శనివారం నిర్వహించిన పరీక్షల్లో వంగా గీతకు పాజిటివ్‌ అని తేలింది. కాగా.. కరోనా లక్షణాలున్నా కూడా పార్లమెంటులోకి అనుమతించబోమని లోక్‌సభ స్పీకర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు ఎంపీలందరినీ పరీక్షించి.. ఫలితం వచ్చిన తరువాత మాత్రమే సభలోకి అనుమతించనున్నారు. కాగా.. పార్లమెంట్ వర్షాకా సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ ఓం బిర్లా ప్రారంభోపన్యాసం చేశారు.

ఇటీవలే మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, సిట్టింగ్ సభ్యుడు వసంత్ కుమార్‌ల మృతికి సంతాపం తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సమావేశాల్లో చేపట్టిన పలు మార్పులపై ప్రవేశపెట్టనున్న తీర్మానంలో క్వశ్చన్ అవర్ రద్దు, జీరో అవర్ కుదింపు, సభా సమయం కుదింపు తదితర అంశాలను ప్రస్తావించనున్నారు. పటిష్టమైన నిబంధనల నడుమ ఈ సమావేశాలు జరుగుతున్నాయి.

More News

దేవరాజ్‌ కారణంగానే శ్రావణి ఆత్మహత్య..!

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు ఎన్నో ములుపుల అనంతరం ఓ కొలిక్కి వస్తోంది.

రకుల్, సారా అలీఖాన్‌లకు మద్దతుగా సమంత..

స్టార్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత తోటి హీరోయిన్స్‌కు అండగా నిలిచింది.

సూర్యకిరణ్ అవుట్.. ఊహించని కంటెస్టెంట్ ఇన్..

ఇవాళ బిగ్‌బాస్ చాలా ఆసక్తికరంగా సాగింది. హోస్ట్ నాగార్జున షోని అద్భుతంగా నడిపించేశారు. ఇవాళ షోలో రెండు ముఖ్యమైన ఘటనలు జరిగాయి.

సెప్టెంబర్ 14కి రష్యా మొత్తానికి కోవిడ్ వ్యాక్సిన్..

ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన దేశం రష్యా.

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆ ఇద్దరి అరెస్ట్

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక వ్యక్తులిద్దరూ అరెస్ట్ అయ్యారు. శ్రావణి ఆత్మహత్య కేసులో ప్రముఖంగా దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డితో పాటు అశోక్‌రెడ్డి పేర్లు వినిపించాయి.