నా ఆరోగ్యం కుదుటపడుతోంది : పవన్

  • IndiaGlitz, [Sunday,April 18 2021]

కరోనా నుంచి తన ఆరోగ్యం కుదుటపడుతోందని వైద్యుల సలహాలు పాటిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. వీలైనంత త్వరగా కోలుకుని అభిమానుల ముందుకు వస్తానన్నారు. తాను కరోనా బారినపడ్డానని తెలిసినప్పటి నుంచి తన యోగక్షేమాల గురించి ఆందోళన చెందుతూ తాను సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ని కావాలని ప్రతి ఒక్కరూ ఆశించారన్నారు. రాజకీయ, సినీ, సామాజిక ప్రముఖులు, మీడియా ప్రతినిధులు తాను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారన్నారు. సందేశాలు పంపారని.. వారందరికీ పవన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

జనసేన పార్టీ నేతలు, జన సైనికులు, అభిమానులు తాను ఆరోగ్యంగా ఉండాలని ఆలయాల్లో, ప్రార్థన మందిరాలలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, యాగాలు చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని పవన్ వెల్లడించారు. అభిమానుల గుండెల్లో తనకు స్థానం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు లాంటి పదాలతో తన భావోద్వేగాన్ని వెల్లడించలేకున్నానన్నారు. ఎప్పటికీ మీరంతా తన కుటుంబ సభ్యులేనన్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మీ ముందుకు వచ్చి.. మీతో పాటే ప్రజల కోసం నిలబడతానని పవన్ వెల్లడించారు.

మరణాలు తగ్గే విధంగా చూడటం ప్రభుత్వ బాధ్యత

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు ఏడు వేలకు పైగా కేసులు, తెలంగాణలో నాలుగు వేలకు పైగా కేసులు ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం నమోదవుతున్నాయి అనీ, అంతకు కొన్ని రెట్ల కేసులు ఉన్నాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సన్నద్ధతతో వ్యవహరించాలి.

More News

అల్లుడుకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక వివాహం జరిగిన విషయం తెలిసిందే.

'రాధేశ్యామ్’లో పూజా పాత్రపై ఆసక్తికర టాక్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’.

సోనూసూద్‌కి కరోనా.. అద్భుతమైన మెసేజ్ ఇచ్చారుగా..

కరోనా మహమ్మారి భారతదేశంలో ప్రవేశించిన సమయంలో ప్రముఖ నటుడు సోనూసూద్ అందించిన సేవలు ఎవరూ మరచిపోలేరు.

ఏప్రిల్ 30న ‘థాంక్యూ బ్రదర్’ ... రిలీజ్ డేట్‌ను ట్విట్ట‌ర్ ద్వారా అనౌన్స్ చేసిన అక్కినేని నాగ‌చైత‌న్య‌

అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘థాంక్యూ బ్రదర్’.  ర‌మేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వం

మాజీ మంత్రి మోత్కుపల్లికి కరోనా.. పరిస్థితి విషమం

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది.