సినిమాల్లోకి రీ ఎంట్రీపై తేల్చేసిన పవన్

  • IndiaGlitz, [Monday,November 04 2019]

జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారనే వార్తలు గత కొద్దిరోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆయన రీ ఎంట్రీ కూడా రీమేక్ చిత్రంతో మొదలవుతుందని అధికారిక ప్రకటన కూడా దాదాపు వచ్చేసినట్లే. అయితే ఎప్పట్నుంచో రూమర్స్ వస్తున్నా.. పలువురు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ సినిమాల్లో నటించాలని సంప్రదించారని.. ఇప్పటికే పలు కథలు విన్నారని కూడా వార్తలు వచ్చేశాయి. మరోవైపు అధికార పార్టీ నేతలు, మంత్రులు, విమర్శకులు సైతం ఇక సినిమాలే చేస్కోండి.. అని కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా విశాఖ వేదికగా మీడియాతో మాట్లాడిన ఆయన ఒక్క మాటతో తేల్చేశారు.

నటిస్తే తప్పేముంది!?

‘నేను మళ్లీ నటిస్తే తప్పేముంది..? మళ్లీ నటించే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అయితే నేను సినిమాలు మాత్రం నిర్మిస్తాను. అవంతి గారు కాలేజీలు మూసివేసి రాజకీయాల్లో ఉన్నారా? జగన్ గారికి జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ వ్యాపారాలు లేవా?. నాకు తెలిసింది సినిమా ఒక్కటే. మున్ముందు చేస్తానో లేదో తెలియదు’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

ఇది గ్రీన్ సిగ్నలేనా!?

మొత్తానికి చూస్తే.. మళ్లీ ముఖానికి మేకప్ వేసుకునే విషయంలో సానుకూల సంకేతాలే ఇచ్చారని దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ మూవీ పింక్ తెలుగు రీమేక్‌లో పవన్ నటిస్తారని... మరో సినిమాకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ గట్టిగానే నడుస్తోంది. ఈ క్రమంలో తన రీ-ఎంట్రీపై పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు జనసేన కార్యకర్తలు, మెగాభిమానుల్లో ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. అసలు ఈ వ్యాఖ్యలు దేనికి సంకేతమో పవర్ స్టార్‌కే తెలియాలి మరి.

More News

బిగ్‌బాస్‌4 హోస్ట్‌ ఆయనేనా?

తెలుగు రియాలిటీ షోస్‌లో బిగ్‌బాస్‌ బాగా క్లిక్‌ అయ్యింది. పలు వివాదాలు.. ఆసక్తికరమైన మలుపులతో సాగే బిగ్‌బాస్‌ షోకి క్రేజ్‌ అంతకంతకు పెరుగుతుంది.

'మీకు మాత్రమే చెప్తా'..3 రోజుల్లోనే 4.05 కోట్ల గ్రాస్

హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన తొలి చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా" ఈ నెల 1న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

తీవ్ర ప్రజాగ్రహమే ‘లాంగ్‌మార్చ్’ సక్సెస్‌కు కారణం!

జనసేన ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లాలో ‘లాంగ్ మార్చ్’ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ లాంగ్‌మార్చ్‌కు అటు టీడీపీ..

పవన్ ‘నిరాహార దీక్ష’పై జనసేన క్లారిటీ!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిరాహార దీక్ష చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్నాయి.

చంద్రబాబుపై మోహన్‌బాబు షాకింగ్ కామెంట్స్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై టాలీవుడ్ సీనియర్ నటుడు, వైసీపీ నేత మోహన్‌బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు.