Janasena Party : పార్టీ జనాల్లోకి వెళ్లాలంటే.. క్రియాశీలక సభ్యులదే కీలకపాత్ర : సభ్యత్వ నమోదుపై పవన్ హర్షం

  • IndiaGlitz, [Monday,June 13 2022]

జనసేన పార్టీ నిర్మాణంలో క్రియాశీలక సభ్యుల పాత్ర కీలకమైనదన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. జనసేన క్రియాశీలక సభ్యుల సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ ప్రజాపక్షం వహిస్తూ చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయడంలో, పార్టీ విధివిధానాలను ప్రతి ఒక్కరికీ తెలియచెప్పడంలో క్రియాశీలక సభ్యుల భాగస్వామ్యం అవసరమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. జనసేన కుటుంబంలో భాగమైన వారి కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పించామని ఆయన గుర్తుచేశారు.

ఈ ఏడాది చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 3.5 లక్షల మంది క్రియాశీలక సభ్యులుగా చేరారని.. 7225మంది పార్టీ వాలంటీర్లు సభ్యత్వ నమోదులో పాలుపంచుకొన్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో గత మూడు రోజులుగా క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ నమోదు పత్రాలతో కూడిన కిట్లు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగడం సంతోషంగా వుందన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ పి.ఎ.సి. సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, జిల్లా, నగర అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంచార్జులు, జిల్లా, నగర, మండల కమిటీల సభ్యులు, వీర మహిళ కమిటీ సమన్వయకర్తలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ, చేనేత, మత్స్యకార, డాక్టర్స్, లీగల్ విభాగాల చైర్మన్లు, సభ్యులు, అధికార ప్రతినిధులు, వీరమహిళలు, జనసైనికులకు పవన్ కల్యాణ్ అభినందనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోను క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ విజవంతంగా చేపట్టిన నాయకులను ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో పార్టీ కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లో మరింత ముందుకు తీసుకువెళ్దామని పవన్ కల్యాణ్ .. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

More News

Hari's Enugu Trailer : ఊరుకుంటే రెచ్చగొడతారా.. ఫుల్ ప్యాక్డ్ మాస్ ఎలిమెంట్స్‌తో ‘ఏనుగు’

సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయుడు అరుణ్ విజయ్‌కి వైవిధ్యమైన చిత్రాలు చేస్తారనే పేరుంది.

prathyusha garimella : ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య.. ఫేమస్ సెలబ్రెటీలు ఆమె కస్టమర్లే

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష గరిమెళ్ల అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలో నివాసముంటున్నారు ప్రత్యూష.

Natti Kumar - RGV : వివాదానికి తెర .. దోస్త్ మేరా దోస్త్ అంటోన్న రామ్‌గోపాల్ వర్మ - నట్టి కుమార్

మొన్నామధ్య సినీ నిర్మాత నట్టి కుమార్, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మధ్య నడిచిన వివాదం అంతా ఇంతా కాదు.

Nagarjuna : 1000 నందుల బలాన్ని గుప్పిట పట్టి.. ‘‘బ్రహ్మాస్త్ర’’లో ఇంట్రెస్టింగ్‌‌గా నాగ్ రోల్

ప్రస్తుతం పాన్ ఇండియా కల్చర్ కారణంగా దక్షిణాది నటులు బాలీవుడ్‌లో.. హిందీ నటులు సౌత్‌లో సినిమాలు చేస్తున్నారు.

nadendla manohar: ప్రభుత్వానికి వ్యతిరేకంగా 73 శాతం మంది... వైసీపీ ఇక ఇంటికే : నాదెండ్ల మనోహర్

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.