close
Choose your channels

దెబ్బకు దెబ్బ బలంగా కొడదాం.. పాలకొల్లు జనసేనదే!

Monday, March 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విశ్వసనీయత కోల్పోయిన నాయకులు పాలకులైతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సోమ‌వారం విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యంలో పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వయ‌క‌ర్త గుణ్ణం నాగ‌బాబు జ‌న‌సేనలో చేరారు. ఈ సందర్భంగా.. ఆయ‌న్ని పవన్ సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు.

పాలకొల్లు జనసేనదే...

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌ మాట్లాడుతూ... "ద‌శాబ్దాలుగా ప‌డిన క‌ష్టం ఫ‌లితాన్నివ్వని ప‌రిస్థితుల్లో నాగ‌బాబు ప‌డుతున్న బాధ ఆయ‌న‌పై పోటీ చేయాల్సిన నాయ‌కుల్ని సైతం కదిలించింది. జ‌న‌సేన పార్టీ బ‌ల‌ప‌డాల‌న్న ఏకైక ల‌క్ష్యంతో స్థానిక జ‌న‌సేన శ్రేణులు సైతం మా అంద‌రికంటే ఆయ‌న అయితే గెలుపు ఖాయ‌మంటూ ఆయ‌న అభ్యర్ధిత్వాన్ని బ‌ల‌ప‌ర్చినందుకు ధ‌న్యవాదాలు.

రాజ‌కీయాల్లో ఇలాంటి సంఘ‌ట‌న‌లు అరుదుగా జ‌రుగుతాయి. ద‌శాబ్దాలుగా చేసిన శ్రమ‌ని వారు గుర్తించ‌రేమో గానీ, జ‌న‌సేన పార్టీ గుర్తిస్తుంది. జ‌న‌సేన పార్టీ పాల‌కొల్లులో ఘ‌న విజ‌యం సాధించాల‌ని కోరుతున్నాం. పాల‌కొల్లు మా కుటుంబానికి హృద‌యానికి ద‌గ్గర‌గా ఉన్న ప్రదేశం. పాలకొల్లులోనే ఉచిత గ్యాస్ సిలిండర్ హామీని ఇచ్చాను. దీర్ఘకాలిక ల‌క్ష్యాల‌తో బ‌ల‌మైన అభివృద్ది జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంది. దెబ్బకు దెబ్బ బలంగా కొడదాం"అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.