పవన్ రూ.కోటి విరాళం

ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన వారికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకు వచ్చారు. తాజాగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లోని ఏరియాలన్నీ జల దిగ్బంధంలో ఉండిపోయాయి. వరద ప్రవాహంలో చిక్కి సామాన్యులు చిగురుటాకుల్లా వణికి పోతున్నారు. నగరమంతా వర్షాలు గడిచిన వారం రోజులుగా నిత్యకృత్యంగా మారిపోయాయి. కాలనీలకు కన్నీళ్లు తప్ప మరొకటి లేదు. ఎక్కడ చూసినా నీళ్లే. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. జనమంతా ప్రాణాలు అరచేతపట్టుకుని ఉన్నారు. ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఆస్తి నష్టమూ అపారం... ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ తన వంతు సాయంగా కోటి రూపాయలు ప్రకటించారు.

‘‘ఒకవైపు కరోనా పట్టి పీడిస్తూ ఉంటే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుదేలైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎడతెరిపిలేని వర్షాలు.. గత కొన్ని దశాబ్దాలు ఎప్పుడూ చూడనంత వర్షాన్ని దేశం మొత్తం చూసింది. ముఖ్యంగా తెలంగాణలో దీని తాకిడి వారం రోజులుగా చాలా ఎక్కువగా ఉంది. దీంతో చాలా మంది జీవితాలు ఛిద్రమైపోయాయి. ఆస్తి నష్టం జరిగింది. ఇళ్లలోకి నీళ్లొచ్చేశాయి. గత కొన్ని దశాబ్దాలుగా టౌన్ ప్లానింగ్ సరిగా లేకపోవడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులను అర్థం చేసుకుని ప్రజలు పడుతున్న కష్టాలను వీటన్నింటినీ చూసి నా వంతు సాయంగా కోటి రూపాయలు ప్రకటిస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సహాయ సహకారాలకు నా సాయం ఉపయోగపడుతుందని భావిస్తున్నా. అలాగే జనసైనికులు, నేతలు సహాయ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనడానికి మీ వంతు కృషి చేయండి’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.

More News

అష్ట దిగ్భంధనం ముగిసింది.. కరోనా కథ ముగియలేదు: మోదీ

కోవిడ్ మహమ్మారిని లైట్‌గా తీసుకోవద్దని భారత ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. నేడు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.

తెలంగాణకు విరాళం ప్రకటించిన ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ సీఎంలు..

భారీ వర్షాలు, వరదలతో పూర్తిగా దెబ్బతిన్న హైదరాబాద్‌ను ఆదుకునేందుకు ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

విజయ్‌ సేతుపతికి బెదిరింపు

అసలు మనుషులు ఏమైపోతున్నారు.. మానవత్వం కనపడటం లేదేంటి?

'నర్తనశాల' బాలకృష్ణ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌!

నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభ‌మైన  పౌరాణిక చిత్రం `న‌ర్త‌న‌శాల`.

రూ. కోటి చొప్పున ప్రకటించిన చిరు, మహేష్

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ భారీగా స్పందిస్తోంది. ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన వారికి బాసటగా నిలుస్తోంది.