నిహారిక పెళ్లిలో పవన్ భావోద్వేగం.. అమ్మ కోసం చిరు ఏం చేశారంటే..

మెగా డాటర్ నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉదయ్ విలాస్ హోటల్ ఈ వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. ఈ వివాహానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ముందుగా పవన్ మినహా మిగిలిన వాళ్లంతా ఉదయ్‌పూర్ చేరుకోగా.. మంగళవారం సాయంత్రం పవన్ కూడా వెళ్లారు. అక్కడ మెగా హీరోల సందడి మామూలుగా లేదు. ఈ వివాహ వేడుక, సంగీత్ తదితర వేడుకలకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మెగా అభిమానులకు మెగా హీరోలందరినీ సింగిల్ ఫ్రేమ్‌లో చూడటం ఐ ఫీస్ట్‌లా మారింది. ఇక నిహారిక వివాహ వేడుకను మెగాస్టార్ చిరంజీవి తన తల్లికి సెల్‌ఫోన్‌లో చూపించడం ఆసక్తికరంగా మారింది. అలాగే నిహారిక వివాహ సమయంలో పవన్ భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన పిక్స్ మరింత ఆసక్తికరంగా మారాయి. ఇక మెగా బ్రదర్ నాగబాబు సైతం తన కూతురి వివాహ వేడుకను చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ట్విట్టర్ వేదికగా అభిమానులతో తన బాధను పంచుకున్నారు.

తన కూతురి వివాహాన్ని.. ఆమె స్కూలు వెళ్లిన తొలి రోజుతో పోల్చి నాగబాబు ఆవేదనకు గురయ్యారు. ‘‘నేను మరోసారి తీవ్ర ఆవేదనకు గురయ్యాను. ఇది ఆమె స్కూలుకు వెళ్లిన మొదటి రోజులా అనిపిస్తోంది అయితే తను సాయంత్రానికి తిరిగి రాదు. నా చిన్నారి కూతురు స్కూలుకు వెళ్లేంత పెద్దదై పోయిందనే నిజం నమ్మడానికే నాకు చాలా ఏళ్లు పట్టింది. ఈసారి ఇంకెన్నాళ్లు పడుతుందో.. కాలమే నిర్ణయిస్తుంది’’ అంటూ నాగబాబు ట్వీట్ ద్వారా అభిమానులతో తన బాధను పంచుకున్నారు.

More News

వైభవంగా నిహారిక పెళ్లి.. నాగబాబు భావోద్వేగం..

మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది అతిథుల సమక్షంలో నిహారిక..

సాయం చేయడానికి ఆస్థులు తనఖా పెట్టిన సోనూసూద్‌

కోవిడ్‌ ముందు కేవలం నటుడిగానే అందరికీ సుపరిచితుడైన సోనూసూద్‌.. కోవిడ్‌ తర్వాత హీరో అయ్యాడు. కొన్ని వందల మందికి తన పరిధిని మించి సాయం చేశాడు. ఇప్పటికీ ఎంతో మంది సాయం కోసం

పొలిటిక్స్‌లోకి వస్తానంటున్న రాశీఖన్నా

ఉ్తతరాది ముద్దుగుమ్మ రాశీఖన్నా.. వరుస తెలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులకు దగ్గరైంది. హీరోయిన్‌గా రాశీఖన్నా కెరీర్‌ను స్టార్ట్‌ చేసి ఏడు వసంతాలను పూర్తి చేసుకుంది.

ఇంటర్నేషనల్‌ కంపెనీపై నాగ్‌ సెన్సేషనల్‌ ట్వీట్‌

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున, ఇంటర్నేషనల్ స్మార్ట్‌ మొబైల్‌ కంపెనీ యాపిల్‌పై సెన్సేషనల్‌ ట్వీట్‌ చేశాడు. "భారత్‌లో యాపిల్‌ స్టోర్స్‌ నుంచి యాపిల్‌ ప్రొడక్ట్స్ కొనేసమయంలో

డైరెక్టర్‌ శంకర్‌ను ఆకట్టుకున్న మూడు సినిమాలు

కోలీవుడ్ స్టార్‌ డైరెక్టర శంకర్‌.. సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. కమల్‌హాసన్‌తో భారతీయుడు 2ను స్టార్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతూనే ఉంది.