‘అల..’ ఫంక్షన్‌లో పవన్ ఫ్యాన్స్ గోల.. బన్నీపై ట్రోలింగ్స్!

  • IndiaGlitz, [Tuesday,January 07 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సునీల్ నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’. సినిమా రిలీజ్‌కు రోజులు దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. సోమవారం నాడు ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ ప్రసంగిస్తూ సినిమాకు సంబంధించి.. మెగాస్టార్ చిరంజీవితో పాటు పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు.

అరుపులూ.. కేకలు!
అయితే ఈ వేడుకలో బన్నీ వ్యవహరించిన తీరుతో మెగా ఫ్యాన్స్, మరీముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హర్ట్ అయ్యారు. బన్నీ కారు దిగి స్టేజ్‌ దగ్గరికి వెళ్లేంత వరకూ పవన్.. పవన్.. అంటూ కేకలతో ఆయన వీరాభిమానులు హడావుడి చేశారు. అయితే ఫ్యాన్స్ గొడవ తట్టుకోలేక.. చేసేదేమీ లేక అసహనానికి లోనైన బన్నీ ‘పవన్’ అంటూ సింపుల్ ఒక్క పదం పలికేసి వెళ్లిపోయాడట. అయితే.. మళ్లీ బన్నీ స్టేజ్‌ ఎక్కిన తర్వాత కూడా ‘పవన్ గురించి మాట్లాడండి’ అని ఫ్యాన్స్ అరుపులు మొదలుపెట్టారు. అప్పటికే ఆగ్రహానికి లోనైన బన్నీ వాళ్ల అరుపులు అస్సలు పట్టించుకోకుండానే తన స్పీచ్‌ను కొనసాగించాడు.

పవన్.. పవన్..!
అయితే ఒకానొక సందర్భంలో చిరంజీవి గురించి మాట్లాడిన అల్లు అర్జున్.. ‘పవన్ కల్యాణ్’ పేరొచ్చేసింది. అప్పుడు ఒక్క నిమిషం పవన్ గురించి మాట్లాడేసుంటే బాగుండేదేమో.. కానీ చిరంజీవి తర్వాత చాలా చాలా ఇష్టపడే వ్యక్తి.. (కాస్త గ్యాప్ ఇవ్వగా) పవన్.. పవన్ ఫ్యాన్స్ అంటూ కేకలేశారు. కానీ బన్నీ మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ అని చెప్పుకొచ్చాడు. ఆయన తన రోల్ మోడల్.. అలాంటి ర‌జినీకాంత్‌గారి సినిమా రిలీజ్ అవుతోంది.. తనకు ఇష్టమైన డైరెక్టర్ మురుగ‌దాస్‌గారు చేసిన సినిమా అని ఈ సంక్రాంతికి ఆయ‌న సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నానని చెప్పాడు. అయితే ఆ తర్వాత కూడా పవన్ గురించి మాట్లాడకపోవడంతో ఆయన ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారట.

బన్నీ వర్సెస్ పవన్ ఫ్యాన్స్!
అంతేకాదు.. ఎంతే సేపూ ‘నా ఫ్యాన్స్, నా అభిమానులు’ అనే పదాలే పలికాడే కానీ ‘మెగాభిమానులు’ అని మాత్రం అనకపోవడంతో మరింత హర్ట్ అయ్యారట. అలా ఫంక్షన్‌లో హర్ట్ అయిన పవన్, మెగాభిమానులు సోషల్ మీడియా వేదికగా బన్నీపై పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నెట్టింట్లో బన్నీ వర్సెస్ పవన్ ఫ్యాన్స్‌గా పరిస్థితులు నెలకొన్నాయ్. మరి ఈ వ్యవహారం సినిమా రిలీజ్‌ దాకా వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటో..!.

ఆలోచించండి అభిమానులారా!
కాగా.. వాస్తవానికి ఏ ఫంక్షన్‌లో చూసిన పవన్.. పవన్ అంటూ అరుపులు కేకలు అనేవి గట్టిగానే వినపడుతున్నాయ్. ఒకానొక సందర్భంలో పవన్ గురించి గట్టిగా అరుస్తుంటే మెగా బ్రదర్ నాగబాబు ఆగ్రహానికిలోనై గట్టిగా క్లాస్ పీకిన విషయం తెలిసిందే. ఏ ఫంక్షన్‌కు వచ్చాం..? ఏం చేస్తున్నాం అనే విషయాలను మరిచి ఫ్యాన్స్ అరుపులు కేకలు వేయడం ఎంతవరకు సబబో వారే ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా పవన్-బన్నీ మధ్య వాస్తవానికి ఎలాంటి గొడవల్లేవ్.. అయితే వీరాభిమానులు మాత్రం ఇలా తిట్టిపోసుకోవడం వల్ల ఒరిగేదేమైనా ఉందా..? ఆలోచించండి అభిమానులారా..? అని సినీ విశ్లేషకులు, విమర్శకులు చెబుతున్నారు.!

More News

వెంకట్రామ్ పల్లా ద‌ర్శ‌క‌త్వంలో ' నీకై అభిసారికనై`  చిత్రం ప్రారంభం!!

అనీషా క్రియేషన్స్ పతాకంపై బాలాజీ సమర్పణలో సుగుణ.ఒ  నిర్మాతగా సాయిబాబు, ఆషీరాయ్, సుర‌య పర్వీన్‌ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతోన్న చిత్రం ' నీకై అభిసారికనై'.

రెజీనా ప్ర‌ధాన పాత్ర‌ధారిగా కార్తీక్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌

న్యూ ఏజ్ ఫిలిమ్ మేక‌ర్‌గా  తొలి చిత్రం `నిను వీడ‌ని నీడ‌ను నేనే` సినిమాతో సూప‌ర్‌హిట్ సాధించి తన ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న ద‌ర్శ‌కుడు కార్తీక్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో

'22' మూవీతో పెద్ద హిట్ కొడ‌తాడు - డైరెక్టర్‌ పూరి జగన్నాథ్

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో

రీ ఎంట్రీ: విజయశాంతి-టబులో ఎవరు బెస్ట్!?

టాలీవుడ్‌లోకి కొన్నేళ్ల తర్వాత సీనియర్ నటీమణులు విజయశాంతి, టబు ఇద్దరూ రీ ఎంట్రీ ఇస్తున్నారు.

చంద్రబాబూ.. మగాడివైతే రా తేల్చుకుందాం: పిన్నెల్లి

వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌పై రైతులు దాడి చేసిన సంగతి తెలిసిందే.