థమన్‌ను ఫాలో అవుతున్న పవన్.. లవ్యూ సర్..!

  • IndiaGlitz, [Saturday,April 04 2020]

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈయనకు ఫాలోయింగ్ యూత్‌లోనే కాదు.. సినీ ఇండస్ట్రీలో కూడా ఉంటారన్న విషయం తెలిసిందే. అందుకే ఆయన అటు రాజకీయాల్లో.. ఇటు సినిమాల్లో రాణిస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి అందరికీ తెలుసు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఆయనకు పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ఉన్నారు. కేవలం ఒక్క ట్విటర్‌లో పవన్‌ను 39 లక్షల మంది అనుసరిస్తున్నారంటే అర్థం చేస్కోండి. ఫాలోవర్స్ సంగతి అటుంచితే పవన్‌ మాత్రం కేవలం 33 మందిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. వీరిలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు.

బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, అన్నయ్య చిరంజీవి, రామ్‌చరణ్, సాయిధరమ్ తేజ్‌తో పాటు మరికొందర్ని.. రాజకీయ ప్రముఖులను పవన్ ఫాలో అవుతున్నాడు. అయితే తాజాగా ఆ జాబితాలోకి టాలీవుడ్‌కు ఓ ప్రముఖ సంగీత దర్శకుడు కూడా చేరాడు. ఆయన మరెవరో కాదండోయ్.. ఎస్ఎస్ థమన్. శనివారం నుంచి పవన్‌.. థమన్‌ను ఫాలో అవ్వడం షురూ చేశాడు. ఈ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా పంచుకున్న థమన్ ఆనందంలో మునిగితేలుతున్నాడు.

వాస్తవానికి పవన్‌కు థమన్ వీరాభిమాని. ఒకానొక సందర్భంలో పవన్‌ సినిమాకు ఒక్కసారైనా పనిచేయాలని ఉందని ఎన్నో రోజులుగా ఈ అవకాశం కోసం వేచి చూస్తున్నట్లు తెలిపాడు. అయితే ‘వకీల్‌సాబ్’తో తన కల నెరవేరిందని అప్పట్లో ట్వీట్ కూడా చేశాడు. అంతేకాదు.. పవన్‌కు సంబంధించిన అన్ని విషయాలను థమన్ ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నాడు.

అయితే.. తాజాగా థమన్‌నే పవన్ ఫాలో అవ్వడం విశేషమని చెప్పుకోవచ్చు. పవన్ ఫాలో అయిన అనంతరం తన ట్విట్టర్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ కూడా చేశాడు. ‘ఒక అభిమానిగా ఇది నాకు చాలా గొప్ప విషయం. ఒక రోజుకు ఇంతకంటే గొప్ప ప్రారంభం ఇంకేం కావాలి. చాలా కృతజ్ఞతలు.. లవ్యూ సర్’ అని థమన్ తన ఆనందాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నాడు. ఈ ట్వీట్‌ను మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున షేర్లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

More News

'ఆర్ఆర్ఆర్‌' విడుద‌ల‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత‌

రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న‌ ప్రెస్టీజియ‌స్ మూవీ ‘రౌద్రం ర‌ణం రుధిరం’. ఇప్ప‌టికే 75 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న

అమ్మ‌డుకి ప‌వ‌ర్ ఫుల్ స్పెష‌ల్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు. బాలీవుడ్ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ను ‘వ‌కీల్‌సాబ్‌’గా

బుట్ట‌బొమ్మ స‌రికొత్త రికార్డ్‌

ఈ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లోని పాట‌ల్లో అల వైకుంఠ పుర‌ములో సాంగ్స్‌కు వ‌చ్చినంత రెస్పాన్స్ మ‌రే సినిమాకు రాలేదు. అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన

చిరు, నాగ్‌ల‌కు మోదీ ప్ర‌శంస‌...

క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ‌మంతా లాక్ డౌన్ ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని సూచించారు. ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్ డౌన్ కొన‌సాగుతుంది.

కార్తీకేయ 2 కోసం సిక్స్ ప్యాక్ చేస్తున్న నిఖిల్ సిద్ధార్థ్

యంగ్ డైన‌మిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, యంగ్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ కార్తీకేయ 2. వ‌రుస హిట్ సినిమాలు రూపొందిస్తున్న