పవన్ సంక్రాంతికి.. మహేష్ దీపావళికి

  • IndiaGlitz, [Monday,January 08 2018]

ఈ సంవ‌త్స‌రం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబుకి వెరీ స్పెష‌ల్ కానుంది. ఎందుకంటే.. ఈ ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కులు న‌టించిన 25వ చిత్రాలు ఈ సంవ‌త్స‌ర‌మే తెర‌పైకి రానున్నాయి. 1996లో అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయితో క‌థానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఈ సంవ‌త్స‌రం అజ్ఞాత‌వాసితో 25 చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నారు. ఈ సినిమా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇక మ‌హేష్‌బాబు విష‌యానికి వ‌స్తే.. 1999లో విడుద‌లైన రాజ‌కుమారుడు చిత్రంతో క‌థానాయ‌కుడిగా తొలి అడుగు వేశారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శలో ఉన్న భ‌ర‌త్ అనే నేను.. మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 24వ చిత్రం. ఇది ఏప్రిల్ 27న విడుద‌ల కానుంది. దీని త‌రువాత వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 25వ చిత్రం చేయ‌నున్నారు మ‌హేష్‌. ఫిబ్ర‌వ‌రిలో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమా.. దీపావ‌ళి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని స‌మాచార‌మ్‌. అంటే.. సంక్రాంతికి ప‌వ‌న్ 25వ చిత్రం రిలీజ్ కానుంటే.. దీపావ‌ళికి మ‌హేష్ 25వ చిత్రం విడుదల కానుంద‌న్న‌మాట‌.

More News

మణిశర్మ లాగే అనిరుధ్ కూడా..

సినిమా అంటే క్రియేటివ్ ఫీల్డ్ అనేది చాలా మంది మాట.

మంచు ఫ్యామిలీకి ఆ రోజు ప్రత్యేకం

ఈ ఫిబ్రవరి మాసం..మంచు కుటుంబానికి చెందిననటులకు ప్రత్యేకం కానుంది.

కన్నడ కుమారిగా నిధి

రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన 'కుమారి 21 ఎఫ్' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలోని పాటలు, మాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

ఆ ప్రాజెక్ట్‌కి గుడ్‌బై చెప్పిందా?

ఈమధ్య బాలీవుడ్‌లో, టాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా ఎక్కుైవెందనే చెప్పాలి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. ఆమధ్య ఎయిర్ హోస్టెస్ నీర్జా బానోత్ జీవిత కథతో తెరకెక్కిన 'నీర్జా' సంచలన విజయం సాధించింది.

ఆ పాట‌లో సాయిధ‌ర‌మ్ తేజ్ స్టెప్స్ మెప్పిస్తాయా?

వి.వి.వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి నాయకానాయికలుగా నటిస్తున్న సినిమా 'ఇంటెలిజెంట్'. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి తమన్ స్వరాలను అందిస్తున్నారు.