క్వారంటైన్‌లో పవన్..

  • IndiaGlitz, [Monday,April 12 2021]

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ మొదటి దశ కంటే అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన కార్య నిర్వాహకులతో పాటు భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. గత వారం రోజులుగా ఆయన పరివారంలోని ఒక్కొక్కరూ కరోనా బారినపడుతూ వస్తున్నారు. వీరంతా పవన్‌కు చాలా సమీపంగా ఉండటంతో ఆయన వైద్యుల సూచన మేరకు క్వారంటైన్‌కు వెళ్లినట్టు జనసేన పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది.

‘‘జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ముఖ్యమైన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్ల సూచనతో శ్రీ పవన్ కల్యాణ్ గారు క్వారంటైన్ కు వెళ్లారు. గత వారం రోజులుగా ఆయన పరివారంలోని ఒక్కొక్కరూ కరోనా బారినపడుతూ వస్తున్నారు. వీరంతా ఆయనకు చాలా సమీపంగా విధులు నిర్వహిస్తారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా, కరోనా విస్తృతి నివారణలో భాగంగా ఆయన క్వారంటైన్ కు వెళ్లారు. డాక్టర్ల సూచనతో ఆయన ప్రశాంత వాతావరణంలో ఉంటున్నారు. రోజువారీ విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు’’ అని జనసేన పార్టీ వెల్లడించింది.

More News

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్.. మెగాస్టార్, రానా చిత్రాలకు షాక్..

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’, రానా దగ్గుబాటి ‘విరాటపర్వం’సినిమాలకు బిగ్‌ షాక్‌ తగిలింది.

కరోనాతో ప్రముఖ నటుడి మృతి

సీనియర్ నటుడు,‘మహాభారతం’ సీరియల్‌ ఫేమ్‌ సతీష్ కౌల్(66) కరోనా బారిన పడి మృతి చెందారు.

‘వకీల్ సాబ్‌’కు హైకోర్టు షాక్...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్’. శుక్రవారం విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో నడుస్తోంది.

నైట్ కర్ఫ్యూపై మంచు విష్ణు కామెంట్.. ఓ ఆటాడుకుంటున్ననెటిజన్స్

కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ లక్షకు పైగా కేసులతో ఆందోళన కలిగిస్తోంది.

ఫ్లవర్ ప్రింటెడ్ బికినీతో కెమెరాకు ఫోజులిచ్చిన జాన్వి

ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ సోషల్ మీడియాలో కొన్ని పిక్స్‌ను పోస్ట్ చేసింది.