Pawan Kalyan: జ్వరం నుంచి కోలుకున్న పవన్ కల్యాణ్.. తిరిగి ప్రచారం మొదలు..

  • IndiaGlitz, [Friday,April 05 2024]

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జ్వరం నుంచి కోలుకున్నారు. దీంతో వారాహి విజయభేరి యాత్ర తిరిగి ప్రారంభించనున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది ఈనెల 7వ తేదీన అనకాపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఏప్రిల్ 8న యలమంచిలిలో నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఏప్రిల్ 9న ఆయన పోటీ చేస్తున్న పిఠాపురంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. తదుపరి ఉత్తరాంధ్రలోని నెల్లిమర్ల, విశాఖ సౌత్, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటన షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తాం అని ప్రకటనలో తెలిపింది.

కాగా మార్చి 30న తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పర్యటించిన ఆయన సుమారు 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అప్పటికే అస్వస్థతతో ఉన్న సేనాని ఎండలో పాదయాత్ర చేయటంతో తీవ్ర జ్వరం బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో తెనాలిలో జరగాల్సిన సభతో పాటు ఉత్తరాంధ్ర పర్యటనను వాయిదా వేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో హైదరాబాద్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన జ్వరం నుంచి కోలుకోవడంతో ప్రచారానికి సిద్ధమయ్యారు.

మరోవైపు పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం విధితమే. ఇప్పటికే పాలకొండ అసెంబ్లీ మినహా 20 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. పాలకొండ టీడీపీ సీనియర్ నేత నిమ్మక జయకృష్ణ ఇటీవల జనసేనలో చేరారు. దీంతో ఆయనకే టికెట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. అనంతరం పూర్తిస్థాయి ప్రచారంపైనే పవన్ దృష్టి పెట్టనున్నారు. జనసేన అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లో రెండు సార్లు ప్రచారం నిర్వహించడంతో పాటు కూటమి తరపున నిర్వహించే భారీ బహిరంగ సభల్లోనూ పాల్గొననున్నారు. మొత్తానికి తమ అధినేత అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి ప్రచార బరిలోకి దిగనుండటంతో జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

More News

Kavitha: కవితకు వరుస ఎదురుదెబ్బలు.. సీబీఐ విచారణకు కోర్టు అనుమతి..

లిక్కర్ స్కాంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా కవితను విచారిస్తామని సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు.

తెలంగాణలోని అసైన్డ్ భూముల కబ్జా వివాదంలో టీడీపీ నేత

తెలుగు రాష్ట్రాల్లో ఏ అవినీతి ఆరోపణలు వచ్చినా దాని వెనక తెలుగుదేశం పార్టీ నేతల పేర్లే వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అవినీతిపరులందరూ ఆ పార్టీలోనే ఉంటారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ బీజేపీ సీనియర్ నేత

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలే హస్తం పార్టీ కండువా కప్పుకోగా.. తాజాగా బీజేపీ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.

Sharmila: హత్యా రాజకీయాలు పోవాలంటే జగనన్నను ఓడించాలి: షర్మిల

రాష్ట్రంలో హత్యా రాజకీయాలు పోవాలంటే జగనన్నను ఓడించాలని ప్రజలకు పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల పిలుపునిచ్చారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని కాశినాయన మండలం అమగంపల్లిలో ఆమె బస్సు యాత్రను ప్రారంభించారు.

Chandrababu: చంద్రబాబుకు భారీ షాక్.. ఎన్నికల సంఘం నోటీసులు..

ఏపీలో ఎన్నికల పోలింగ్‌కు మరో 40 రోజులు మాత్రమే ఉంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నాయి.