వృద్ధురాలి ప్రేమకు ముగ్ధులైన పవన్


Send us your feedback to audioarticles@vaarta.com


గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ విజయాన్ని కాంక్షిస్తూ వేగులమ్మ అమ్మవారికి మొక్కులు మొక్కి... తన పింఛను సొమ్ముతో మొక్కులు చెల్లించారు పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన వృద్ధురాలు శ్రీమతి పోతుల పేరంటాలు గారు.
పింఛను సొమ్ము దాచుకొని అమ్మవారికి రూ.27వేల విలువైన గరగ చేయించి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, శ్రీమతి పేరంటాలు గారిని మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని ఆమెతో ముచ్చటించారు. తనపై చూపిన మమకారానికి ముగ్దులయ్యారు.
శ్రీమతి పేరంటాలు గారితో కలసి భోజనం చేశారు డిప్యూటీ సీఎం. ఆత్మీయంగా పలుకరిస్తూ స్వయంగా భోజనం వడ్డించారు. చీరను బహూకరించారు. పింఛను సొమ్ముతో మొక్కులు చెల్లించిన విషయం తెలుసుకుని ఆర్థిక సాయం అందించారు. శ్రీమతి పేరంటాలును క్యాంపు కార్యాలయంలోకి ఆత్మీయంగా ఆహ్వానించిన పవన్ కళ్యాణ్, తిరుగు ప్రయాణానికి ఏర్పాటు చేసి, వాహనం వరకు వచ్చి స్వయంగా సాగనంపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com