సరికొత్త టైటిల్‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కార‌ణ‌మ‌దే..!

  • IndiaGlitz, [Tuesday,February 02 2021]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ 27వ చిత్రంగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. కోవిడ్ ముందు ప్రారంభ‌మైన ఈ చిత్రం.. కోవిడ్ నేప‌థ్యంలో ఆగింది. రీసెంట్‌గా షూటింగ్ పునః ప్రారంభ‌మైంది. వ‌కీల్‌సాబ్‌ను ముందు పూర్తి చేసిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇప్పుడు రెండు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. అందులో ఒక‌టి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా కాగా.. మ‌రో చిత్రం సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో నిర్మిమ‌త‌వుతున్న అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్ రీమేక్‌. ఇందులో క్రిష్ సినిమా విష‌యానికి వ‌స్తే.. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఈ చిత్రంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డే బందిపోటు పాత్ర‌లో క‌నిపిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ‘విరూపాక్ష‌’ అనే టైటిల్‌ను అనుకున్నారు. అయితే ఆ టైటిల్‌ను మ‌రొక‌రు రిజిష్ట‌ర్ చేసి ఉండ‌టంతో.. ద‌ర్శ‌కుడు క్రిష్ ప‌వ‌న్ 27వ చిత్రానికి ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు.

పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటారు. అందులో శ్రీలంక‌న్ బ్యూటీ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ ఓ హీరోయిన్‌గా న‌టిస్తుంది. కాగా.. మ‌రో హీరోయిన్ పాత్ర‌లో ఇస్మార్ట్ శంక‌ర్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ న‌టిస్తుంది. ప్ర‌ముఖ నిర్మాత ఎ.ఎం.ర‌త్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.