లుక్ మార్చిన పవన్.. కొత్త సినిమా కోసమేనా!?

  • IndiaGlitz, [Thursday,June 20 2019]

జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక రెండు చోట్ల పోటీచేసినప్పటికీ.. ఈ రెండు స్థానాల్లోనూ వైసీపీ విజయకేతనం ఎగరేసింది. ఇది జనసేనకు పెద్ద షాకింగ్ అయ్యింది. అయితే.. ఆ షాక్ నుంచి తేరుకోకమునుపే సోషల్ మీడియా వేదికగా పలువురు విమర్శకులు, ముఖ్యంగా వైసీపీ వీరాభిమానులు, టీడీపీ ఫ్యాన్స్ ఇక రాజకీయాలెందుకు మళ్లీ బ్యాక్ టూ సినిమాలకెళ్లండి అంటూ ఉచిత సలహాలివ్వడం మొదలెట్టేశారు.

మరోవైపు.. వెబ్‌సైట్లు సైతం.. పవన్ కల్యాణ్ ఫలానా దర్శకుడితో సినిమా చేయబోతున్నాడని పెద్ద ఎత్తున వార్తలు రాసేశాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌పై పవన్ కల్యాణ్ రియాక్ట్ అవుతూ.. తన ప్రాణం ఉన్నంత వరకూ రాజకీయాల్లోనే కొనసాగుతానని తేల్చిచెప్పారు. తాజాగా పవన్.. గుబురు గడ్డం, హెయిర్‌స్టెయిల్‌ మొత్తం తీసేసి.. గడ్డం కాస్త ట్రిమ్ చేసి.. జుట్టు కూడా కాస్త కట్ చేశారు. చెక్స్ షర్ట్, జీన్స్ ప్యాంట్‌తో ఇలా పవన్ సరికొత్త లుక్ కనిపించారు. మరోవైపు వైసీపీ ఫ్యాన్స్ మాత్రం మేం ముందే చెప్పాం.. పవన్ మళ్లీ సినిమాల్లోకి వస్తారని.. ఇదిగో ఈ లుక్‌ చూశాక కూడా సందేహాలెందుకు ఇది పక్కాగా సినిమా కోసమేనని ట్రోల్ చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. పవన్ సరికొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఈ లుక్‌ను చూసిన పవన్ వీరాభిమానులు, జనసేన కార్యకర్తలు మా సారు మారిపోయారు.. గెటప్ అదిరింది అని అనుకుంటున్నారు. అయితే ఈ గెటప్ మొత్తం మార్చింది కొత్త సినిమాకోసమేనని విమర్శలూ వస్తున్నాయి. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తే.. తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పించాలని పవన్ భావించారట. అయితే ఫలితాలు రివర్స్‌గా రావడంతో పవన్ ఇలా కట్ చేయించారట. ఈ నయా లుక్ సినిమాల కోసమో.. రాజకీయాల కోసమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

More News

అది హిట్ అయితే... శ్రుతి గ్లోబ‌ల్ స్టారే

ఏ ప్రాజెక్ట్ ఎవ‌రిని ఏ అంద‌లాలు ఎక్కిస్తుందో తెలియ‌దు. కొన్నిసార్లు అదృష్టం హ‌ఠాత్తుగా త‌లుపు త‌డుతుంది.

రానా ‘విరాటపర్వం’ స్టోరీ లీక్ అయిందా ?

దగ్గుబాటి రానా, సాయి పల్లవి నటీనటులుగా వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న చిత్రం ‘విరాటపర్వం 1992’. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే లాంచనంగా షూటింగ్ ప్రారంభమైంది.

పెద్ద బ్యానర్లో అర్జున్ రెడ్డి భామ

అర్జున్ రెడ్డి భామ షాలినీ పాండే కొత్త‌గా తెలుగులో ఓ సినిమాకు సంత‌కం చేశార‌ని వినికిడి. అందులో ఆమె అడ్వ‌కేట్ పాత్ర పోషించ‌నున్నారు.

'సుప్రీమ్‌' కాంబో తో మారుతి

మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా న‌టించ‌బోయే సినిమా కోసం రోజుకొక పేరు వినిపిస్తోంది.

కేసీఆర్‌ను క‌లిసిన శంక‌ర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్ క‌లిశారు. ముఖ్య‌మంత్రిని శాలువాతో స‌త్క‌రించారు.