పవన్ సరికొత్త రికార్డ్

  • IndiaGlitz, [Wednesday,September 13 2017]

బాహుబ‌లి త‌ర్వాత ప‌వ‌న్ కొత్త సినిమా బిజినెస్ ప‌రంగా రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది. వివ‌రాల్లోకెళ్తే..'జ‌ల్సా', 'అత్తారింటికి దారేది' చిత్రాల త‌ర్వాత ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'అజ్ఞాత‌వాసి' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

ఈ సినిమా వ‌చ్చే ఏడాది జ‌న‌వరి 10న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంద‌ట‌. అమెరికా, నైజాం ఏరియాల్లో క‌లిసి సినిమాను 50 కోట్ల రూపాయ‌ల‌కు అమ్మార‌ట‌. అందులో అమెరికాలో 21 కోట్ల రూపాయ‌లైతే, నైజాంలో ప్ర‌ముఖ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ 29 కోట్ల‌కు కొన్నార‌ని స‌మాచారం. ఇంత భారీ మొత్తం అమ్ముడ‌వ‌డానికి కార‌ణం ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ క్రేజీ కాంబినేష‌నే కార‌ణం.

More News

రీమేక్ లో సునీల్..?

అందాల రాముడు సినిమాతో కమెడియన్ సునీల్ హీరోగా మారాడు.

యాక్సిడెంట్ అనంతరం మళ్ళీ షూటింగ్ మొదలెట్టిన మంచు విష్ణు

'ఆచారి అమెరికా యాత్ర' షూటింగ్ లో భాగంగా తెరకెక్కిస్తున్న ఓ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తుండగా..

త‌మ‌న్నాని పొగిడిన కెమెరామేన్‌

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా బాహుబ‌లి 2 త‌రువాత మూడు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సందీప్ కిష‌న్‌తో ఓ సినిమా, క‌ళ్యాణ్ రామ్‌తో ఓ సినిమా,క్వీన్ తెలుగు రీమేక్‌లో త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తోందిప్పుడు.

'స్పైడ‌ర్' డామినేట్ చేస్తోంది

తెలుగు, త‌మిళ భాష‌ల్లో ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కింది మ‌హేష్ బాబు స్పైడ‌ర్‌. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ ని చెన్నైలో నిర్వ‌హించి.. అక్క‌డ ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌తో మ‌హేష్  తమిళ తెర ఎంట్రీకి ఘ‌న స్వాగ‌తం చెప్పించిన సంగ‌తి తెలిసిందే.

రాశికి ఆ పాట నచ్చిందట

ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది రాశీ ఖన్నా.