తెలుగు చలన చిత్ర పరిశ్రమ దాతృత్వానికి జేజేలు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

క‌రోనా వైర‌స్ నివార‌ణా చ‌ర్య‌ల‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్ డౌన్ ప్ర‌క‌టించాయి. ప్ర‌జ‌ల‌ను ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని సూచిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు సినీ తార‌లు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు, పేద సినీ కళాకారులను ఆదుకోవ‌డానికి విరాళాల‌ను ప్ర‌క‌టించారు. దీనిపై జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంద‌రికీ కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. నాలుగు కోట్ల రూపాయ‌ల విరాళం ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌కు, కోటి రూపాయ‌లు విరాళం ప్ర‌క‌టించిన మ‌హేశ్‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసిన ప‌వ‌న్‌.. సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా త‌క్ష‌ణ‌మే స్పందించే త‌న పెద్ద అన్న‌య్య చిరంజీవి..క‌రోనా వ‌ల్ల ఉపాధి కోల్పోయిన పేద క‌ళాకారులు, టెక్నిషియ‌న్స్‌కు కోటి రూపాయ‌లు విరాళం ఇచ్చినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని పేర్కొన్నారు. అలాగే తండ్రి అడుగు జాడ‌ల్లో న‌డిచిన రూ.70 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించిన రామ్‌చ‌ర‌ణ్‌కు, రూ.75 లక్ష‌లు విరాళం ఇచ్చిన తార‌క్‌కి, కోటి పాతిక ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళాన్ని అందించిన బ‌న్నీకి, తొలి విరాళంగా రూ.20 ల‌క్ష‌లు ప్ర‌క‌టించిన నితిన్‌, రూ.10 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించిన సాయితేజ్‌కి, రూ.20 ల‌క్ష‌లు రూపాయ‌ల విరాళం అందించిన త్రివిక్ర‌మ్‌, కొర‌టాల శివ‌, దిల్‌రాజుల‌కు, ప‌దిల‌క్ష‌ల రూపాయ‌లు అందించిన అనిల్ రావిపూడి, రూ.5 ల‌క్ష‌లు అందించిన త‌మ‌న్‌కు ప‌వ‌న్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

వీరింద‌రితో పాటు ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండు కోట్ల రూపాయ‌లు విరాళాన్ని అందించారు. అందులో కోటి రూపాయ‌లు ప్ర‌ధాని మంత్రి సహాయ నిధికి, రెండు తెలుగు రాష్ట్రాల‌కు కోటి రూపాయ‌ల‌ను విరాళాన్ని అందించారు.

ప‌వ‌న్ థాంక్స్‌కు మ‌హేశ్‌, బ‌న్నీ వంటి వారు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

More News

"ఆడు క‌న‌బ‌డితే నిప్పు క‌ణం నిల‌బ‌డిన‌ట్టుంట‌ది.." గూజ్ బమ్స్ రేపుతున్న రామ‌చర‌ణ్ బ‌ర్త్‌డే ట్రీట్‌

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో భారీబ‌డ్జెట్‌, హైటెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం

ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఈఎంఐ చెల్లింపు దారులకు భారీ ఊరట

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో యావత్ ప్రపంచ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరోవైపు.. భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు

ప‌వ‌న్‌, కేటీఆర్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన సంభాష‌ణ‌

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ధ్య ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌రిగిన సంభాష‌ణ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇంత‌కూ వీరిద్ద‌రీ మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ ఏంటి? ఎందుకు జ‌రిగింది?

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. పరీక్షలు లేకుండానే పై తరగతికి!

కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఏపీలోని జగన్ సర్కార్

కరోనాపై యుద్ధానికి యంగ్ టైగర్ 75 లక్షల విరాళం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో.. టాలీవుడ్ నటీనటులు పలు జాగ్రత్తలు, సలహాలు, సూచనలిస్తూ చైతన్య పరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరింత పెద్ద మనసు చేసుకుని క్లిష్ట పరిస్థితుల్లో తెలుగు