సినిమాల కంటే ప్రజల సమస్యలే ముఖ్యం - పవన్

  • IndiaGlitz, [Monday,May 15 2017]

2019 ఎన్నిక‌ల కోసం జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాల‌తో పాటు, పార్టీ బ‌లోపేతానికి కూడా త‌న వంతుగా కృషి చేస్తున్నారు. వీలునప్పుడ‌ల్లా ప్ర‌త్యేక స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. జ‌న‌సేన సైనికుల కోసం వివిధ జిల్లాల్లో నోటిఫికేష‌న్స్ ఇస్తున్నారు. అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసుకుంటున్నారు. పూర్తిస్థాయి రాజ‌కీయాల కోసం పార్టీని స‌మాయ‌త్తం చేస్తున్నారు.

తాజాగా అనంతపురం జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తో ప‌వ‌న్ బేటీ అయ్యారు. అనంత‌పురం జిల్లాలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డానికి పాద‌యాత్ర చేస్తాన‌ని ప‌వ‌న్ తెలిపారు. అవ‌స‌ర‌మైతే తాను రాజ‌కీయాల కోసం సినిమాల‌ను విడిచి పెట్టేస్తాన‌ని అన్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల కోసం తుదిశ్వాస వ‌ర‌కు పోరాడతాన‌ని అన్న ప‌వ‌న్ అస‌లు త‌న‌ను పూర్తిస్థాయి రాజ‌కీయ నాయ‌కుడు కాద‌ని కొంద‌రు అంటున్నారని, అస‌లు పూర్తిస్థాయి రాజ‌కీయ నాయ‌కులు ఎవరున్నారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి కోట్లు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు.

More News

కన్నతల్లి గుడిని ప్రారంభించిన లారెన్స్

నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడైన రాఘవ లారెన్స్కు తల్లి అంటే ఎంతో ఇష్టం. తల్లిదండ్రులే దైవాలని చెప్పే లారెన్స్ కన్నతల్లి కోసం ఏకంగా గుడినే కట్టేశాడు.

విజయ్ దేవరకొండాతో హెబ్బా

కుమారి 21ఎఫ్తో తెరంగేట్రం చేసిన హెబ్బా పటేల్ ఇప్పుడు వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం హెబ్బా పటేల్ నటించిన అంధగాడు, ఏంజెల్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

'దంగల్' దూకుడు

బాహుబలి-2 కలెక్షన్స్ సునామీ తర్వాత ఓవర్సీస్లో అమీర్ ఖాన్ దంగల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మే 5న విడుదలైన దంగల్ చైనాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

'జూన్ 1:43' టీజర్, ప్రోమో సాంగ్స్ విడుదల

ఆదిత్య క్రియేషన్స్ బ్యానర్పై ఆదిత్య, రిచా హీరో హీరోయిన్లుగా భాస్కర్ బంతుపల్లి దర్శకత్వంలో లక్ష్మి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `జూన్ 1:43`.

మెదటి వీకెండ్ కి ప్రపంచ వ్యాప్తంగా 97 లక్షల వసూలుచేసిన 'వెంకటాపురం'

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం ఈ నెల 12న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడదలయ్యి మంచి చిత్రంగా ప్రశంశలు పొందుతుంది.