పవన్ సిగ్గుపడాలి.. చంద్రబాబు వాటర్ బాటిల్స్ కనిపించవ్!

  • IndiaGlitz, [Saturday,June 01 2019]

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మే-30న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ వైపు అధికారుల బదిలీలు.. టెండర్ల రద్దు.. డీజీపీ, ఐబీ అధికారుల మార్పులు చేర్పులు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. ప్రమాణ స్వీకారం చేసిన రోజే పెన్షన్ల పెంపుపై జగన్ మొదటి సంతకం చేశారు. దీంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు భారీగా పెన్షన్లు పెంచడం జరిగింది. కాగా ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తూ ట్విట్టర్‌లో హడావుడి చేశారు.

అటు పవన్.. ఇటు చంద్రబాబుపై పరోక్షంగా కామెంట్స్!

వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్లను భారీగా పెంచి చరిత్ర సృష్టించింది. కిడ్నీ బాధితుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నవారంతా సిగ్గుపడాలి. కిడ్నీ బాధితులకు యువ ముఖ్యమంత్రి జగన్ ‘నేను చూశాను.. నేను ఉన్నాను’ అంటూ నెలకు రూ.10,000 అందజేస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు యువ ముఖ్యమంత్రి కిడ్నీ బాధితులకు నెలకు పదివేల ఆసరా కల్పించారు. దుబారా ఖర్చులను సీఎం వైఎస్‌ జగన్ కట్టడి చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇది స్పష్టంగా కనిపించింది. ప్రతి రూపాయి వ్యయానికి జవాబుదారితనం ఉంటుంది. హిమాలయా వాటర్ బాటిల్స్ కనిపించవు. రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసి కూడా గత ప్రభుత్వం విలాసాలు వదులుకోలేదు అని చంద్రబాబు ప్రభుత్వ దుబార ఖర్చులు, పవన్ ఉద్దానం వ్యవహారంపై విజయసాయిరెడ్డి పరోక్షంగా ప్రస్తావించారు.

కాగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్ధానం కిడ్నీ బాధితుల విషయాన్ని అప్పట్లో తెరపైకి తెచ్చి నిద్రమత్తులో ఉన్న ప్రభుత్వాన్ని నిద్రలేపి వైద్యం అందించేలా చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై తాజాగా విజయసాయిరెడ్డి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే చంద్రబాబు, పవన్‌పై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

జూలై 5న స‌మంత అక్కినేని ఫ‌న్ రైడ‌ర్‌ `ఓ బేబీ` విడుద‌ల‌

స‌మంత అక్కినేని, ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన తారాగ‌ణంగా బి.వి.నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ` ఓ బేబీ`. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు

మురళీ మోహన్‌కు ఆపరేషన్.. చిరు దంపతుల పరామర్శ

టాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ ముర‌ళీమోహ‌న్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నారు.

మళ్లీ ‘ప్రేమ’ నేర్చుకోవడం సాధ్యమేనా..!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ సినీ ప్రియులు, జనసేన కార్యకర్తలు, అభిమానులకు కొత్త పరిచయం చేయనక్కర్లేదు.

చివరి రక్తపుబొట్టు వరకు ప్రజాసేవే.. ఇప్తార్ విందులో బాలయ్య

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం నుంచి వరుసగా రెండు సార్లు గెలిచి నిలిచిన ఎమ్మెల్యే బాలయ్య ముస్లిం సోదరులకు ఇపఫ్తార్ విందు ఇచ్చారు.

ఘనంగా జరిగిన సూపర్‌స్టార్‌ కృష్ణ 77వ జన్మదిన వేడుకలు

పద్మ భూషణ్‌ నటశేఖర సూపర్‌ స్టార్‌ కృష్ణ గారి 77వ జన్మదిన వేడుకలు మే31న హైదరాబాద్‌ పద్మాలయ స్టూడియోస్‌లో