హిట్ కాంబినేషన్ ...పవన్ తో

  • IndiaGlitz, [Wednesday,November 25 2015]

2001లో విడుద‌లైన ఖుషీ' సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు, మెగాభిమానులు అంత సుల‌భంగా మ‌ర‌చిపోరు. ఎస్‌.జె.సూర్య ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కానీ హిట్ కాంబో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, సూర్య వెంట‌నే సినిమా చేయ‌లేదు. దాదాపు తొమ్మిదేళ్ళ త‌ర్వాత వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పులి' బాక్సాఫీస్ వ‌ద్ద బోర్లాప‌డింది. అప్ప‌టి వ‌ర‌కు హిట్ కొట్టి చాలా గ్యాప్ తీసుకున్న ప‌వ‌న్, పులి'తో అయినా స‌క్సెస్ కొడ‌తాడ‌ని అభిమానులు ఆశ‌గా ఎదురుచూపులు నిరాశ‌నే మిగిల్చాయి. తాజాగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, సూర్య క‌లిసి సినిమా చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయట‌. ఎలాగైనా ప‌వ‌న్‌తో స‌క్సెస్ కొట్టాల‌ని ఎస్‌.జె.సూర్య ప‌ట్టుద‌ల‌గా ఉన్నాడ‌ట‌. మ‌రి సినిమాల‌ను చాలా నెమ్మ‌దిగా చేస్తున్న ప‌వ‌న్ సూర్య‌కు ప‌చ్చ‌జెండా ఊపుతాడంటారా.. చూద్దాం...