అలా నేను, మా ఇంట్లో వాళ్లం నా బర్త్‌డేని మరచిపోయేవారం: పవన్

  • IndiaGlitz, [Tuesday,September 01 2020]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బర్త్‌డేను పురస్కరించుకొని జనసైనికులు, నాయకులు, వీర మహిళలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్ కిట్లు వితరణ చేశారు. ఈ సేవా కార్యక్రమాల వివరాలను పార్టీ నేతలు పవన్ కల్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ బృహత్ సేవా కార్యక్రమంపై జనసేన పార్టీ మీడియా విభాగంతో సమావేశమైన సందర్భంగా మాట్లాడారు. ఇప్పుడున్న ఆరోగ్య విపత్కర పరిస్థితుల్లో జనసేన శ్రేణులు, నాయకులు, అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎన్నో విలువైనవనీ... వారు తమ అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు సామాజిక సేవా మార్గాన్ని ఎంచుకోవడాన్ని ఎప్పటికీ మరచిపోలేనన్నారు.

ఇక తాను బర్త్ ‌డే వేడుకలకు దూరంగా ఉండటానికి కారణాలను సైతం ఈ సందర్భంగా తెలిపారు. ‘‘బర్త్‌డే వేడుకలు జరుపుకోకపోవడానికి ప్రత్యేకించి కారణాలు ఏమీ లేవు. చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. చిన్నప్పుడు ఒకటి, రెండు సందర్భాల్లో స్కూల్లో చాక్లెట్లు పంచినట్లు గుర్తు. తర్వాత అన్నయ్య దగ్గరకు వెళ్లడం... అటు నుంచి ఇటు రావడం ఈ ప్రక్రియలో పుట్టిన రోజుని నేను, నాతోపాటు మా ఇంట్లో వాళ్లు కూడా మరిచిపోయేవారు.

రెండు రోజుల తర్వాత ఇంట్లో ఎవరికో ఒకరికి గుర్తొచ్చేది. గుర్తొచ్చినప్పుడు మా వదిన డబ్బులు ఇస్తే పుస్తకాలు కొనుక్కునేవాడిని. అంతకుమించి ప్రత్యేకంగా జరుపుకోవడం అలవాటు లేదు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్నేహితులు, నిర్మాతలు పుట్టిన రోజు వేడుకలు చేసే ప్రయత్నం చేస్తే ఇబ్బంది అనిపించింది. కేక్ కట్ చేయడం, ఆ కేక్ తీసుకొచ్చి నా నోట్లో పెట్టడం ఎబ్బెట్టుగా అనిపించి మానేశాను. అంతే తప్ప ప్రత్యేకంగా వేరే కారణాలు ఏమీ లేవు’’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

More News

లోన్లు, ఈఎంఐ ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం!

లోన్లు, ఈఎంఐ ఉన్నవారికి మారటోరియం పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది.

ప్ర‌భాస్ బాట‌లో మ‌హేశ్ కూడా...!!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’.

టార్గెట్ ఫిక్స్ చేసిన ప‌వ‌న్‌!!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత వ‌రుస సినిమాల‌కు ఓకే చెబుతూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు.

కార్తీక్ రాజు దర్శకత్వంలో ఎమోషనల్ థ్రిల్లర్ గా ‘ది ఛేజ్’

సందీప్ కిషన్ హీరోగా ‘‘నిను వీడను నీడను నేనే’’, లాంటి థ్రిల్లర్ మూవీ తీసి ఆకట్టుకున్న డైరెక్టర్ కార్తీక్ ప్రస్తుతం రెజీనా తో ‘‘నేనే నా’’

మామయ్యను చంపేశారు.. మా మేనత్త పరిస్థితి విషమంగా ఉంది: రైనా

టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా సడెన్‌గా ఐపీఎల్ నుంచి వెనక్కి వెళ్లిపోవడం దానికి గల కారణాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.