అభిమానుల‌కు అండ‌గా నిలిచిన వారికి ప‌వ‌న్ థాంక్స్‌

  • IndiaGlitz, [Thursday,September 03 2020]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం, శాంతిపురం మండ‌లంలో, ప‌వ‌న్ క‌టౌట్ క‌డుతున్న అభిమానుల‌కు విద్యుత్ ఘాతం  త‌గిలింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు అభిమానులు చ‌నిపోగా, న‌లుగురు ఆసుప‌త్రి పాల‌య్యారు. వీరికి ప‌వ‌న్ స‌హా ప‌వ‌న్‌తో సినిమా చేస్తున్న నిర్మాత‌లు, మెగా హీరోలు రామ్‌చ‌ర‌ణ్‌, బ‌న్నీ ఆర్థిక సాయాన్ని అందించారు. దీనిపై పవ‌న్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ‘‘కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన  రాంచరణ్‌కి.. అలాగే పెద్దమనుసు తో ముందుకు వచ్చిన అల్లు అర్జున్‌కి,నిర్మాతలు దిల్ రాజు,  ఏ.ఎమ్ రత్నం , మైత్రి మూవీస్ నవీన్ గారికి నా కృతజ్ఞతలు’’ అని ప‌వ‌న్ ట్వీట్ చేశారు.

చ‌నిపోయిన అభిమానుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ త‌ర‌పున ఒక్కొక్క మృతుడి కుటుంబానికి రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే వ‌కీల్ సాబ్ నిర్మాత‌లు స‌హా మైత్రీ మూవీస్ సంస్థ‌, ప‌వ‌న్‌తో 27వ సినిమా చేస్తున్న మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ సంస్థలు కూడా ఒక్కొక్క కుటుంబానికి రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు ఆర్థిక సాయాన్ని అందించారు. అల్లు అర్జున్ కుటుంబానికి రెండు ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని అందించ‌గా.. రామ్‌చ‌ర‌ణ్ రెండున్న‌ర ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని అందించారు.

More News

'ఆది పురుష్' లో ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్న బాలీవుడ్ హీరో

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న భారీ బ‌డ్జెట్ ఎపిక్ విజువ‌ల్ వండ‌ర్ మూవీ ఆది పురుష్ కి సంబంధించ‌ని ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

కేంద్రం కీలక నిర్ణయం.. పబ్జీ సహా 118 యాప్‌లపై నిషేధం..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు మరోసారి భారత్ షాక్ ఇచ్చింది.

ప‌వ‌న్ 28...డిఫ‌రెంట్‌గా ప్లాన్ చేసిన హ‌రీశ్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రెండో చిత్రం ప్రారంభం కానుంది.

‘ఆచార్య’ సినిమా క‌మిటీపై లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకోనున్న రాజేశ్‌

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య‌’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తు్నారు.

‘వి’ చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా జ‌స్టిఫికేష‌న్ ఉన్న పాత్ర చేయ‌డం చాలా హ్యాపీగా అనిపించింది : సుధీర్‌బాబు

హీరోగా, నిర్మాత‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నారు సుదీర్ బాబు. ‘స‌మ్మోహ‌నం’ త‌ర్వాత ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో