గోపీచంద్ మూవీకి పవన్ టైటిల్..!

  • IndiaGlitz, [Thursday,October 27 2016]

గోపీచంద్ హీరోగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని శంఖం, రెబ‌ల్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా సంస్థ నిర్మిస్తుంది. జె.పుల్లారావు, జె.భ‌గ‌వాన్ సంయుక్తంగా ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే...ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సంప‌త్ నంది స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాని తెర‌కెక్కించాలి కానీ...కొన్ని కార‌ణాల వ‌ల‌న‌ కుద‌ర‌లేదు. అయితే..ప‌వ‌న్ పై సంప‌త్ నందికి ఉన్న అభిమానంలో మాత్రం ఎలాంటి మార్పులేదు.
అందుక‌నే అనుకుంట‌...గోపీచంద్ తో చేస్తున్న సినిమాకి ప‌వ‌న్ న‌టించిన అత్తారింటికి దారేది చిత్రంలోని పాటైన ఆర‌డుగుల బుల్లెట్ టైటిల్ గా పెడ‌దాం అనుకుంటున్నార‌ట‌. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అయిన ఈ మూవీకి ఈ టైటిల్ స‌రిగ్గా స‌రిపోతుంది అని భావిస్తున్నార‌ట చిత్ర‌యూనిట్. మ‌రి...ఈ టైటిల్ క‌న్ ఫ‌ర్మ్ చేస్తారో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!

More News

బాలయ్యతో పూరి సినిమా..!

డేరింగ్&డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇజం చిత్రం ఇటీవల రిలీజైన విషయం తెలిసిందే.

ఫైట్స్ చిత్రీకరణలో మహేష్

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

..లేకుండా బ‌త‌క‌లేను అంటున్న స‌మంత‌..!

ఏమాయ చేసావే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ స‌మంత‌. త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుని స‌మంత అన‌తి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఎందరో నిస్సహాయుల జీవితంలో వెలుగులు నింపుతున్న మేము సైతం కు విశేష స్పందన

మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తి స్పూర్తితో తమ కష్టాలతో జీవన పోరాటం చేస్తున్న ఎందరో నిస్సహాయుల జీవితంలో వెలుగులు నింపడానికి, వారి కలల్ని నిజం చేస్తున్న ఆశాజ్యోతిగా లక్ష్మి మంచు మేము సైతం రూపంలో చేస్తున్న కృషి తెలిసిందే.

నవంబర్ లో 'ద్వారక'

సూపర్గుడ్ ఫిలింస్ సమర్పణలో లెజెండ్ సినిమా పతాకంపై ప్రద్యుమ్న- గణేష్ సంయుక్తంగా నిర్మించిన సినిమా “ద్వారక`.ఈ ఏడాది సెన్సేషనల్ హిట్ `పెళ్లిచూపులు`తో అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ దేవరకొండ కథానాయకుడుగా, పూజా జవేరి కథానాయిక. శ్రీనివాస్ రవీంద్ర (ఎంఎస్ఆర్) దర్శకత్వం వహించారు.