అరుల్మిగు సోలైమలై మురుగన్ సేవలో పవన్ కళ్యాణ్


Send us your feedback to audioarticles@vaarta.com


షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్రలో భాగంగా ఈరోజు ఉదయం తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లాలో అళగర్ కొండల్లో కొలువైన అరుల్మిగు మురుగన్ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పవన్ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
ఆలయ సంప్రదాయానికి అనుగుణంగా మురుగన్ కు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం క్షేత్ర విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఆలయంలో జరుగుతున్న స్కంద షష్టి కవచం, తిరుప్పుకల్ పారాయణంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ వెంట ఆయన తనయుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు.
మురుగన్ దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ ఆలయ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. షష్ట షణ్ముఖ యాత్రలో భాగంగా ఇప్పటివరకు 5 సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల దర్శనం పూర్తయిందని, తిరుత్తణిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో షణ్ముఖ యాత్ర పూర్తవుతుందని వెల్లడించారు.
కొద్దిసేపటి కిందట తిరుత్తణిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనాన్ని కూడా పూర్తిచేశారు పవన్ కల్యాణ్. దీంతో షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్ర పూర్తయింది. త్వరలోనే ఆయన తిరిగి విధుల్లో చేరుతారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com