తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్

  • IndiaGlitz, [Friday,January 22 2021]

ప్రస్తుతం చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి తిరుమల చేరుకున్న పవన్ నేడు వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. పవన్‌కు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేష వస్త్రంతో సత్కరించారు. అనంతరం పవన్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

తిరుమల వేంకటేశ్వరుని దర్శనానంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది నుంచి స్వామివారిని దర్శించుకోవాలని భావిస్తున్నానని.. కానీ కరోనా కారణంగా రాలేకపోయానన్నారు. నేడు స్వామివారి ఆశీస్సులు లభించాయని తెలిపారు. కాగా.. గురువారం రాత్రి తిరుపతిలో జరిగిన చిత్తూరు జిల్లా జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగే ఉపఎన్నికలో ఎవరు పోటీ చేయాలనే అంశంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చామని.... మరో రెండు మూడు సమావేశాల అనంతరం పూర్తి స్పష్టత వస్తుందని పవన్ వెల్లడించారు.

More News

జనసైనికులతో పవన్ సమావేశం... కీలక అంశాలపై చర్చ

తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగే ఉపఎన్నికలో ఎవరు పోటీ చేయాలనే అంశంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చామని....

సీరం ఇన్‌స్టిట్యూట్‌లో అగ్ని ప్రమాదం.. ఐదుగురి మృతి

ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా(సీఐఐ)కు చెందిన నూతన ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

సుప్రీంకోర్టుకెక్కిన ఏపీ ‘పంచాయతీ'

అనుకున్నదంతా అయ్యింది.. ఏపీ ‘పంచాయతీ’ సుప్రీంకోర్టుకెక్కింది. గురువారం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం

నల్గొండలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి

పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లి.. తిరిగి ఇంటికి చేరుకుంటున్న తరుణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

నాగ‌శౌర్య‌, కేపి రాజేంద్ర కాంబినేష‌న్‌లో ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ చిత్రం `పోలీసు వారి హెచ్చ‌రిక`

యంగ్ హీరో నాగ‌శౌర్య‌హీరోగా కేపీ రాజేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం `పోలీసు వారి హెచ్చ‌రిక‌`.