'వ‌కీల్‌సాబ్' కోసం ప‌వ‌న్ ప‌డ్డ క‌ష్టం

  • IndiaGlitz, [Monday,April 20 2020]

సినిమాలకు రెండేళ్లు దూరమై రాజకీయాల్లోనే గడిపిన జ‌న‌సేనాని,ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సైలెంట్‌గా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేశాడు. ఆయ‌న టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ చిత్రం ‘పింక్’కు ఇది రీమేక్. ఈ ఏడాది మే 15న వ‌కీల్‌సాబ్‌ను విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు దిల్‌రాజు, బోనీక‌పూర్ భావించారు. అయితే కోవిడ్ 19 విజృంభించ‌డంతో దేశంలోని అన్నీ సినిమాల షూటింగ్‌ల‌ను ఆపేశారు. అలా వ‌కీల్‌సాబ్ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమా గురించి ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు రీసెంట్‌గా మాట్లాడారు.

‘‘వ‌కీల్ సాబ్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఒక ప‌క్క రాజ‌కీయాల‌కు సంబంధించిన ప‌నుల‌ను చూసుకుంటూనే ప‌వ‌న్ సినిమాలో న‌టించారు. అందు కోసం ఆయ‌న చాలా కష్టపడ్డారు. 22 రోజుల పాటు రాత్రి సమయాల్లో సినిమాను చిత్రీకరించారు. ఆ సమయంలో పవన్‌క‌ల్యాణ్ ప‌గ‌లు రాజ‌కీయ ప‌నుల్లో బిజీగా ఉండేవారు. అందుకోసం నిర్మాత ఓ చార్టెడ్ ఫ్లైట్‌ను అరెంజ్ చేశారు. అందులో ప‌వ‌న్ 22 రోజుల పాటు ప్ర‌యాణించారు. ఈ 22 రోజుల్లో దాదాపు 600 కిలోమీట‌ర్ల‌కు పైగా ప్ర‌యాణించారు’’ అని తెలిపారు డైరెక్ట‌ర్ శ్రీరామ్ వేణు. ఈ సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ట‌. ప్ర‌కాశ్‌రాజ్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి ఇందులో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

More News

చంద్రబాబుకు చిరు బర్త్ డే విషెస్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పుట్టిన రోజు నేడు. ఇవాళ్టితో ఆయన 70వ పడిలోకి అడుగుపెట్టారు.

సినీ కార్మికుల ఆ పని చేయ‌డానికి కూడా సిద్ధ‌మేనంటున్న మెగాస్టార్‌

కరోనా వైరస్ ప్రభావంతో దేశమంతటా లాక్ క్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉంటుంది. తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమంటున్నారు

'పుష్ప'లో బ‌న్నీ స‌ర్‌ప్రైజ్ ఇదేనా..?

టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా చిత్రంగా చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో జరిగే

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో సినిమా గురించి జ‌క్క‌న్న ఏం చెప్పారంటే...!!

ఇండియ‌న్ సినిమాలో ఇప్పుడు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్. ఆయ‌నతో సినిమాలు చేయాల‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

మెగాఫ్యాన్స్ కంగారు

ఇప్పుడు మెగాఫ్యాన్స్ కంగారు ప‌డుతున్నార‌ట‌. అందుకు కార‌ణంగా మెగాస్టార్ చిరంజీవి ఓ డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయ‌బోతున్నాన‌ని రీసెంట్‌గా ప్ర‌క‌టించ‌డ‌మే