Pemmasani: రాసిపెట్టుకోండి పవన్ కళ్యాణ్ విజయాన్ని ఆపలేరు.. ప్రభుత్వానికి పెమ్మసాని సవాల్

  • IndiaGlitz, [Wednesday,April 17 2024]

తాను పుట్టిన ప్రాంతంలో ప్రజలు పడుతున్న కష్టాలు చూసి రాజకీయాల్లోకి వచ్చానని గుంటూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పెదకాకాని మండలంలోని కొప్పురావూరు, వెనిగండ్ల, పెదకాకాని ప్రాంతాల్లో పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో పెదకాకాని మండలం పసుపుమయమైంది. రహదారులు కానరాని విధంగా పూల వర్షం కురిపించింది. స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ పెమ్మసాని, ధూళిపాళ్ల ప్రచార కార్యక్రమాలను కొనసాగించారు.

పెమ్మసాని ప్రచారం ఇలా అంగరంగ వైభవంగా కొనసాగుతుండగా ప్రధాన కూడలికి వచ్చేసరికి ఉన్నట్టుండి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. అధికారులను ప్రశ్నించినా సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. దాదాపు అరగంట పాటు విద్యుత్ సరఫరా నిలిచి నిలిచిపోయింది. కాగా అభిమానుల అండ ఉన్న పెమ్మసాని మొబైల్ లైట్ల వెలుగుల మధ్యనే తన ప్రచారాన్ని ముందుకు కొనసాగించారు. అభిమానులు, కార్యకర్తలు చైతన్య రథానికి చుట్టూ రక్షణ కవచంలా నిలబడి ప్రచార కార్యక్రమం ముందుకు సాగడానికి సహకరించారు.

ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ‘విద్యుత్ కట్ చేసినంత మాత్రాన మా ప్రయాణం ఆగదు బ్రదర్. ప్రజా విప్లవ కాంతిలో నుంచి ప్రజాయాత్ర చేసుకుంటూ వస్తాను. నేను మీలాగా మద్యం అమ్మానా? మోసం చేశానా? మైనింగ్ తవ్వనా? ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. నా ప్రాంతంలో ప్రజలు పడుతున్న కష్టాలు చూసి రాజకీయాల్లోకి వచ్చాను. నేను సంపాదించిన కరెన్సీకి ఉన్న నిజాయితీ, నీ అవినీతి సొమ్ముకు ఉండదు బ్రదర్! మైనింగ్‌లు తవ్వి, అక్రమాలు చేసిన అవినీతి సొమ్ముతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఈ సోకాల్డ్ నాయకులు ఓడిస్తారట. రాసి పెట్టుకోండి ఇప్పుడే చెబుతున్నాను. తలరాత రాసిన బ్రహ్మ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ విజయాన్ని ఆపలేరు అని సవాల్ విసిరారు.

వైసీపీ ప్రభుత్వంలో ఓవైపు నిత్యావసర సరుకుల ధరలు, కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంకోవైపు చూస్తే ఆదాయం లేక ప్రజలు అల్లాడిపోతున్నారని తెలిపారు. . ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే టీడీపీ కూటమి అధికారంలోకి రావాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితమైన మార్పు తీసుకువస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పేదలకు, నివాసం లేని ప్రజలకు టిట్కో ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత తాము తీసుకొంటామని హామీ ఇచ్చారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థిగా తనను, ఎమ్మెల్యే అభ్యర్థిగా ధూళిపాళ్ల నరేంద్రకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఇక ధూళిపాళ్ల మాట్లాడుతూ ‘ఈ నియోజకవర్గంలో ఒక్కో వ్యక్తికి ఈ వైసీపీ నాయకులు రూ. లక్ష దాకా అప్పు పడ్డారు. మన సొమ్మును దోచుకు వెళ్లి రేపు ఎన్నికల్లో తిరిగి రూ. 5 వేలు, రూ. 10 వేలు అంటూ ఓట్లు కొనడానికి వస్తారు. దేవాలయాలు, మందిరాలకు వెళ్లి మనస్ఫూర్తిగా దండం పెట్టుకునే మనలాంటి భక్తులకు బదులు హుండీలో చేయి పెట్టే దొంగ, దోపిడి నాయకులు మన ప్రాంతంలో ఉన్నారు. 31 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని మా కుటుంబం నమ్ముకుని ఉంది. రాజధాని నిర్మాణానికి అడ్డుపడ్డ కరకట్ట కమలహాసన్ ప్రజలను మోసం చేశారు. అవినీతి సొమ్ముతో నన్ను నాశనం చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశారు. మీ దగ్గర అవినీతి సొమ్ము ఉందేమో! నా దగ్గర ప్రజాభిమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారం ఈ ప్రాంతంలో జరుగుతున్న అవినీతిని ఎందుకు అడ్డుకోలేకపోయింది? అది అసమర్థతా? చేతకానితనమా? జగన్మోహన్ రెడ్డి దగ్గర టికెట్ తెచ్చుకోవడం చేతకాని నాయకులు పెదకాకానికి వచ్చి తామున్నామని చెప్పి మాట్లాడటం, ప్రజలను ఇంకా మోసపుచ్చటం సిగ్గుచేటు. అలాంటి నాయకుల మాట వింటే మళ్లీ మోసపోవడానికి సిద్ధపడ్డట్టే. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాగలిగే సత్తా లేని నాయకులు, శివాలయం రోడ్డుని శివాలయం నిధులతోనూ, దర్గా దగ్గరి రోడ్డును దర్గా నిధులతోనూ నిర్మించే స్థితికి చేరారు.’ అని వెల్లడించారు.

ఇక పెదకాకాని మండలంలో పర్యటిస్తున్న సందర్భంగా పెమ్మసాని ఎమ్మార్పీఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ గుంటూరు జిల్లా ఇంచార్జ్ కూచిపూడి సత్యం మాదిగ మాట్లాడుతూ ఏపీలో అనేక పార్టీలు పాలన సాగించినప్పటికీ మాదిగల వర్గీకరణకు కృషి చేసింది టిడిపినే అన్నారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో టిడిపికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు పెమ్మసాని గెలుపులో మాదిగల పాత్ర కచ్చితంగా ఉంటుందని తెలిపారు.

More News

Modi: అయోధ్యలో అద్భుత ఘట్టం.. ప్రధాని మోదీ భావోద్వేగం..

దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రామాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలి శ్రీరామనవమి కావటంతో భక్తులు అయోధ్యకు

YSRCP: ఏపీ ఎన్నికలపై మరో జాతీయ సంస్థ సర్వే.. వైసీపీ ప్రభంజనం ఖాయం..

ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగున్నాయి. పోలింగ్‌కు నెల రోజులు కూడా సమయం లేకపోవడంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

Konchem Hatke:‘కొంచెం హట్కే’ పెద్ద విజయం సాధించాలి: డైరెక్టర్ నందినీ రెడ్డి

గురు చరణ్, కృష్ణ మంజూష ప్రధాన పాత్రల్లో అభిమాన థియేటర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మాణంలో అవినాష్ కుమార్ తీసిన చిత్రం ‘కొంచెం హట్కే’.

Pemmasani:టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే పరిశ్రమలు తీసుకొస్తాం: పెమ్మసాని

రాష్ట్రంలో  వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు భయపడి పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నాయని గుంటూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్. పెమ్మసాని చంద్రశేఖర్

BJP:సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ.. త్రిముఖ పోరుకు సిద్ధం..

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉపఎన్నికకు తమ అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది.  టీఎన్‌ వంశా తిలక్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తూ బీజేపీ అధిష్టానం తాజాగా ప్రకటన విడుదల చేసింది.