అనురాగ్‌పై కేసు ఫైల్ చేసిన పాయ‌ల్‌

డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్‌పై రీసెంట్‌గా లైంగిక ఆరోప‌ణ‌లు చేసిన న‌టి పాయ‌ల్ ఘోష్ ఇప్పుడు ఆయ‌న‌పై పోలీస్ స్టేష‌న్‌లోకేసు న‌మోదు చేశారు. ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేష‌న్‌లో పాయ‌ల్ ఫిర్యాదును పోలీసులు ఫైల్ చేశారు. లాయ‌ర్ సాత్నుటేతో క‌లిసి పాయ‌ల్ పోలీసుల‌కు కంప్లైంట్ చేశారు. ఐపీసీ సెక్ష‌న్ 376ఐ, 354, 341, 342, అనురాగ్‌పై కేసు న‌మోదైంది. ఏడేళ్ల క్రితం వెర్సోవాలోని యారి రోడ్డులో క‌శ్య‌ప్ త‌న‌పై బ‌లాత్కార ప్ర‌య‌త్నం చేశాడ‌ని పాయ‌ల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును స్వీక‌రించిన పోలీసులు త‌దుప‌రి ద‌ర్యాప్తును చేయ‌బోతున్నారు.

అనురాగ్ క‌శ్య‌ప్ ఇంటికెళ్లినప్పుడు త‌న‌ను బలాత్కారం చేయ‌బోయాడ‌ని, త‌న‌కు రిచాచ‌ద్దా, మ‌హిగిల్‌, హూమా ఖురేషిల‌తో సంబంధం ఉన్న‌ట్లు చెప్పుకొన్నాడంటూ ఓ వీడియో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే పాయ‌ల్ వీడియో విడుద‌లైన త‌ర్వాత అనురాగ్ క‌శ్య‌ప్‌కు సినీ ఇండ‌స్ట్రీ నుండి మ‌ద్ద‌తు పెరిగింది. మాజీ భార్య క‌ల్కికొచ్లిన్ స‌హా ఎక్కువ మంది ప్ర‌ముఖులంద‌రూ అనురాగ్‌కే స‌పోర్ట్ చేశారు. కంగనార‌నౌత్‌, మ‌రికొంత మంది ట్విట్ట‌ర్ వేదిక‌గా అనురాగ్‌ను ద‌య్య‌బ‌ట్టారు. ఈ వ్య‌వ‌హారంపై స్పందించిన అనురాగ్ నిరాధార ఆరోప‌ణ‌లంటూ కొట్టిపారేశాడు. మ‌రి పాయ‌ల్ ఘోష్‌పై అనురాగ్ ఏమైనా చ‌ర్య‌లు తీసుకుంటాడేమో చూడాలి.

More News

ఒక్క ట్వీట్ చాలు.. పోకిరీల పని ఫసక్..

ఇవాళా.. రేపు ట్విట్టర్ ఖాతాలు అందరికీ ఉంటూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్విట్టరే బాధితులకు వరంగా మారనుంది. మనల్ని ఎవరో వేధిస్తున్నారంటూ మన బంధువులకో..

భారత్‌లో 57 లక్షలకు చేరువలో కేసులు..

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య 57 లక్షలకు చేరువవుతుండగా.. మరణాల సంఖ్య 90 వేలు దాటింది. అలాగే కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉండటం ఊరట కలిగిస్తోంది.

'రంగ్‌దే' షూటింగ్ స్టార్ట్..

‘భీష్మ’ మంచి సక్సెస్ సాధించిన అనంతరం అదే జోష్‌తో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘రంగ్‌దే’. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి

ఆదిలోనే కొడాలిని కంట్రోల్‌లో పెట్టి ఉంటే..

అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు అంటారు. ఇదే విషయాన్ని ఏపీ సీఎం జగన్ తమ పార్టీ నేతల విషయంలో పాటించలేదనేది పలువురి వాదన. ముఖ్యంగా మంత్రి కొడాలి నానిని ఆదిలోనే కంట్రోల్‌లో పెట్టి ఉండే

బిగ్‌బాస్: వార్ బిగిన్స్.. ఇక బీభత్సమే..

నేటి బిగ్‌బాస్ షో మొత్తం ఫిజికల్ టాస్క్‌తో నడిచింది. రోబోలు, మనుషుల మధ్య వార్ ఆసక్తికరంగా నడిచింది. పోయిన వారం సెల్ఫ్ నామినేట్ అవడంతో హోస్ట్ నాగార్జున ఓ రేంజ్‌లో క్లాస్ పీకారు.