close
Choose your channels

గ‌వ‌ర్న‌ర్‌ని క‌లిసిన పాయ‌ల్‌.. డైరెక్ట‌ర్‌కి స‌మ‌న్లు

Wednesday, September 30, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గ‌వ‌ర్న‌ర్‌ని క‌లిసిన పాయ‌ల్‌.. డైరెక్ట‌ర్‌కి స‌మ‌న్లు

డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్‌పై రీసెంట్‌గా లైంగిక ఆరోప‌ణ‌లు చేసిన న‌టి పాయ‌ల్ ఘోష్ మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోష్యారిని క‌లిసింది. జ‌రుగుతున్న ప‌రిణామాల గురించి ఆయ‌న‌కు వివ‌రించి త‌నకు భ‌ద్ర‌త క‌ల్పించ‌మ‌ని, వై కేట‌గిరీ భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని పాయ‌ల్ కోరింది. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ.. ‘‘గౌరవనీయులైన గవర్నర్ భగత్‌సింగ్‌ కోష్యారీగారిని ఈరోజు కలిశాను. ఆయనతో సమావేశం గొప్పగా జరిగింది. నన్ను ఆపేవాళ్లు, విమర్శించేవాళ్లు, అభ్యంతరం చెప్పేవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ నేను వేటికీ ఆగకుండా ముందుకెళ్తాను’’ అన్నారు పాయ‌ల్. ఈ మీటింగ్‌కు పాయ‌ల్ లాయ‌ర్ సాత్నుటే పాటు రాజ్య‌స‌భ స‌భ్యుడు రాందాస్ అథ‌వాలే ఉన్నారు.

అంతే కాకుండా అప్ప‌టికే అనురాగ్‌క‌శ్య‌ప్‌పై ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేష‌న్‌లో పాయ‌ల్ ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఏడేళ్ల క్రితం వెర్సోవాలోని యారి రోడ్డులో క‌శ్య‌ప్ త‌న‌పై బ‌లాత్కార ప్ర‌య‌త్నం చేశాడ‌ని పాయ‌ల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును స్వీక‌రించిన వెర్సోవా పోలీసులు అనురాగ్‌కు స‌మ‌న్లు పంపారు. అనురాగ్‌ను రేపు స్టేష‌న్‌కు రావాలన్నారు. మ‌రి రేపు అనురాగ్ పోలీసుల‌కు ఏం చెబుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.