పీఏసీ భేటీలో టీడీపీ ఎమ్మెల్యేకు అస్వస్థత..

  • IndiaGlitz, [Thursday,November 07 2019]

అనంతంపురం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం నాడు అమరావతిలో జరిగిన పీఏసీ భేటీకి పయ్యావుల హాజరయ్యారు. అయితే ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. ఫుడ్ పాయిజన్ అయ్యిందని ఈ వార్త విన్న తెలుగు తమ్ముళ్లు.. పయ్యావుల వీరాభిమానుల్లో టెన్షన్ మొదలలైంది. సమావేశంలో ఇలా జరిగిందని తెలుసుకున్న తోటి తెలుగు తమ్ముళ్లు హుటాహుటిన స్థానికంగా ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూయన మేరకు విజయవాడ ఆయుష్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం.

పూర్తి వివరాల్లోకెళితే.. ఇవాళ పీఏసీ సమావేశం జరుగుతుండగా మధ్యలో పయ్యావులకు వాంతులయ్యాయి. దీంతో వెంటనే అసెంబ్లీ డిస్పెన్సరీలో చికిత్స అందజేశారు. స్వల్ప అస్వస్థతేనని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కాగా.. పయ్యావుల.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మంచి ఆప్తుడు అనే విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఉరవకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే.. వైఎస్సార్సీపీ నేత విశ్వేశ్వరరెడ్డిని ఓడించి పయ్యావులు గెలుపొందారు. అయితే ఆ తర్వాత పయ్యావుల రాజీనామా చేసి మరీ వైసీపీలోకి వెళ్లడానికి సిద్ధమైనట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే.

More News

మోహన్‌బాబుకు వైఎస్ జగన్ హామీ.. త్వరలో కీలక పదవి!?

ఒకానొక సందర్భంలో రాజకీయాల్లో కీలకంగా ఉన్న టాలీవుడ్ సీనియర్ నటుడు కమ్ నిర్మాత మోహన్‌ బాబు..

ఎమ్మార్వో హత్యకేసు నిందితుడు సురేష్ మృతి.. వాట్ నెక్స్ట్!

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి దారుణ హత్యకేసులో నిందితుడు సురేష్ మృతి చెందాడు.

మ‌హేశ్ విడుద‌ల చేసిన 'ద‌ర్బార్‌' తెలుగు మోష‌న్ పోస్ట‌ర్‌

సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `దర్బార్`.  

టీడీపీకి మరో షాక్.. లేడీ ఫైర్‌బ్రాండ్ గుడ్‌ బై!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు ఎక్కువయ్యాయి.

కన్న‌డలోకి రాజ్‌త‌రుణ్ ఎంట్రీ

మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ ఇప్పుడు తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు.