పి.సి.శ్రీ‌రామ్ ట్రాక్ రికార్డ్ ప్ల‌స్ అవుతుందా?

  • IndiaGlitz, [Sunday,June 03 2018]

ద‌క్షిణాదిలోనే కాకుండా హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన కెమెరా పనితనంతో గొప్ప చిత్రాలుగా మలచిన ఘ‌న‌త‌ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ సొంతం. ‘గీతాంజలి’ (1989) సినిమా ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు నేరుగా ప‌రిచ‌య‌మైన శ్రీ‌రామ్‌.. త‌న ప్ర‌తిభాపాట‌వాల‌తో స‌మ్మోహ‌న‌ప‌రిచారు. ఆ తర్వాత ‘శుభసంకల్పం’, ‘ఖుషి’, ‘కేక’, ‘ఇష్క్’ లాంటి సినిమాలకు పని చేసారు. వీటిలో ‘కేక’ మినహాయిస్తే.. మిగిలిన సినిమాలన్నీ సూపర్ హిట్ మూవీస్ కావడం విశేషం.

తెలుగులో విజయవంతమైన సినిమాటోగ్రాఫర్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉన్న పి.సి.శ్రీరామ్.. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా జయేంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘నా నువ్వే’కి కెమెరామాన్‌గా పనిచేసారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి పి.సి.శ్రీరామ్ హస్తవాసితోనైనా.. విజయం కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్‌కి ఆ విజయం వరిస్తుందేమో చూడాలి.

More News

సంక్రాంతి సంద‌డి వీరిదేనా?

2019 సంక్రాంతి ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌నుందా? అవుననే వినిపిస్తోంది ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల‌లో. వినిపిస్తున్న క‌థ‌నాల ప్రకారం..

భారీ బడ్జెట్‌తో కార్తి 'దేవ్'

గత ఏడాది విడుదలైన ‘ఖాకి’ (తమిళంలో ‘దీరన్ అధిగారం ఒండ్రు’) సినిమా మంచి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

మూడోసారైనా లేడీ డైరెక్టర్ కలిసొస్తారా?

వరుసగా మహిళా దర్శకులతో సినిమాలు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్న‌ కథానాయిక అమైరా దస్తూర్.

డబుల్ ధ‌మాకా ఇవ్వ‌నున్న మ్యూజిక్ డైరెక్టర్

‘అర్జున్ రెడ్డి’.. సంచలనానికి మారు పేరుగా నిలిచిన సినిమా.

'తేజ్‌ ఐ లవ్‌ యు' ఫస్ట్‌ సాంగ్‌ లాంచ్‌

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో