close
Choose your channels

వరద సాయం నిలిపివేత.. మిన్నంటిన ఆగ్రహావేశాలు..

Thursday, November 19, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాష్ట్ర ప్రభుత్వం వరద సాయం కింద అందిస్తున్న రూ.10 వేల కోసం ప్రజలు విరివిగా దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే నేడు ఎన్నికల సంఘం ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వరద సాయాన్ని వెంటనే నిలిపేయాలని బుధవారం ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో వరద సాయం పంపిణీతో పాటు రిజిస్ట్రేషన్లు కూడా నిలిపేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకూ నిలిపివేసి.. అనంతరం చెల్లించుకోవచ్చని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వరద సాయానికి సడెన్‌గా బ్రేక్ పడింది.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు జంట నగరాలను ముంచెత్తాయి. హైదరాబాద్‌లోని ప్రతి ఏరియా మునిగిపోయింది. ఇక కొన్ని ప్రాంతాల వాసులైతే సర్వస్వం కోల్పోయారు. ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ క్రమంలోనే తొలుత కొందరికి సాయం అందించారు. అయితే ఆ సాయం అసలైన వ్యక్తులకు చేరట్లేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మంత్రి కేటీఆర్ మీ సేవ లేదంటే ఈ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు మీసేవ, ఈసేవ కేంద్రాలకు పరుగులు పెట్టారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వరద సాయాన్ని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

తెల్లవారు జాము నుంచే క్యూలైన్లలో నిలబడి నానా తిప్పలు పడుతున్న ప్రజానీకానికి ఒక్కసారిగా వరద సాయం నిలిపివేత ప్రకటనతో ఆగ్రహావేశాలు మిన్నంటాయి. బాధితులంతా రోడ్ల పైకి వచ్చి ఆందోళనకు దిగారు. పలు చోట్ల వరద బాధితులు ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల జనం మీ-సేవా కేంద్రాల వద్దే ఆందోళనకు దిగారు. కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలో రోడ్డుపై మహిళలు బైఠాయించారు. రాంనగర్‌లో సిటీ బస్సులను వరద బాధితులు నిలిపివేశారు. వనస్థలిపురంలో తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.