నేను తప్పు మాట్లాడితే మీ బూటు విసరండి!: నాని

నవ్యాంధ్రకు మూడు రాజధానులు ఉండొచ్చేమోనన్న సీఎం వైఎస్ జగన్ ప్రకటనతో అమరావతి ప్రాంతంలో రైతులు రాస్తారోకోలు, ర్యాలీకి దిగారు. ఈ క్రమంలో ఈ రాజధాని అంశంపై తాడో పేడో తేల్చేందుకు గాను శుక్రవారం నాడు ఏపీ కెబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని తరలింపుతో పాటు పలు కీలక విషయాలపై నిశితంగా చర్చించారు. సుమారు 2:15 గంటలు పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భేటీ అనంతరం సమావేశంకు సంబంధించి వివరాలను సచివాలయంలో మీడియా మీట్‌ పెట్టి సమాచార శాఖమంత్రి పేర్ని నాని వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిశితంగా వివరాలు తెలిపారు. ఈ క్రమంలో మీడియా మిత్రులు సంధించిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.

ప్రశ్న : శాంతి భద్రతల విషయంలో సీఎం సీపీఆర్వోను కూడా బయట ఆపేస్తున్నారు ప్రభుత్వం ఏమైనా బయపడిందా..? అని మీడియా మిత్రులు మంత్రి పేర్ని నానిని ప్రశ్నించారు. ఇందుకు ఆయన చాలా లాజిక్‌గా సమాధానం ఇచ్చారు.

మీ బూటుతో కొట్టండి!
‘రాష్ట్రంలో శాంతి భద్రతలు చూడాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్‌మెంట్ చూసుకుంటుంది. పరిస్థితులను అనుగుణంగా పోలీసు శాఖ చూసుకుంటుంది. బాధ్యత మేరకే వారు ప్రవర్తిస్తారు. అంతేకానీ.. నేను చెప్పినట్లు పోలీస్ డిపార్ట్‌మెంట్ వినదు కదా. నేను మంత్రిగా ఈ మధ్యనే వచ్చాను.. అన్నీ తెలిసిన మీరే (మీడియా) ఇలా మాట్లాడితే ఎలాగండి..?. నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే నా చొక్కా పట్టుకోండి. చాలా మంది విలేకర్లు తప్పుమాట్లాడితే పెద్ద పెద్దోళ్ల మీద బూటు విసురుతుంటారు. నేను తప్పు మాట్లాడుంటే మీ బూటు విసరండి’ అని మంత్రి నాని చమత్కరించారు. నాని మాట్లాడుతున్నంత సేపు.. మీడియా మిత్రులు పగలబడి నవ్వారు. అనంతరం పలు ప్రశ్నలు మీడియా మిత్రులు సంధించగా మంత్రి సమాధానమిచ్చారు.

More News

'భీష్మ' తొలి గీతం విడుదల

నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై

'క్షీర సాగర మథనం' ఫస్ట్ లుక్ విడుదల

దేవతలు-రాక్షసులు సాగరాన్ని మధించినప్పుడు అమృతంతోపాటు హాలాహలమూ వచ్చింది.

ఈ ఇయర్‌ ఎండింగ్‌లో ఆడియన్స్‌ నవ్వుతూ ఎంజాయ్‌ చేసే చిత్రం 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌` - నిర్మాత, నటుడు కె.శేఖర్‌ రాజు

'జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా' వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా, 'రాజుగారి గది' ఫేమ్‌ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై

ప్రియాంక చోప్రాకు షాక్‌

బాలీవుడ్ నుండి హాలీవుడ్‌లో అడుగుపెట్టి.. నిక్ జోన‌స్‌ను పెళ్లి చేసుకుంది ప్రియాంక చోప్రా. త‌ర్వాత స్కై ఈజ్ పింక్ అనే సినిమాలో న‌టించింది.

అఖిల్‌కి నో చెప్పి.. కార్తీకి ఎస్ చెప్పిన ద‌ర్శ‌కుడు

రీసెంట్ టైమ్స్‌లో ఓ కోలీవుడ్ ద‌ర్శ‌కుడు అఖిల్‌తో సినిమా చేస్తాడ‌ని జోరుగా వార్త‌లు వినిపించాయి. అయితే లేటెస్ట్ సినీ వ‌ర్గాల స‌మాచారం