'పేట్ట' తెలుగులో విడుద‌ల కావ‌డం లేదా

  • IndiaGlitz, [Sunday,December 16 2018]

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ 165వ చిత్రం 'పేట్ట‌'. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.

ర‌జ‌నీకాంత్‌తో పాటు న‌వాజుద్దీన్ సిద్ధికీ, విజ‌య్ సేతుప‌తి, త్రిష‌, సిమ్రాన్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ధారులు. అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న‌ విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు సిద్ధం చేస్తున్నారనే సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ సినిమాను తెలుగులో మాత్రం అనుకున్న‌ట్లు సంక్రాంతికి విడుద‌ల చేయ‌డం లేద‌ట‌. అందుకు కార‌ణం.. సంక్రాంతికి తెలుగులో విన‌య‌విధేయ రామ‌, ఎఫ్ 2 చిత్రాలు విడుద‌ల‌వుతుండ‌టంతో పేట్ట సినిమాకు థియేట‌ర్స్ దొర‌క‌డం లేద‌ట‌. దాంతో నిర్మాత‌లు సినిమాను తెలుగులో జ‌న‌వ‌రి చివ‌రి వారంలో విడుద‌ల చేయాల‌నుకుంట‌న్న‌ట్లు టాక్‌.

More News

న‌టి పై కాల్పులు

గ‌తంలో ఆర్ధిక నేరాల‌కు పాల్ప‌డిన న‌టి, మోడ‌ల్ లీనాపాల్‌పై శ‌నివారం మ‌ధ్యాహ్నం ఇద్ద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్పులు జ‌రిపి పరార‌య్యారు.

ద‌ర్శ‌కుడితో నితిన్ చ‌ర్చ‌లు

ఈ ఏడాది 'ఛలో' సినిమాతో స‌క్సెస్ అందుకున్న ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌. ఈ యువ ద‌ర్శ‌కుడు నితిన్‌తో 'భీష్మ' సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడు.

రామ్‌చ‌ర‌ణ్‌, బ‌న్ని అతిథులుగా...

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ హాజ‌ర‌వుతున్నారు.

బ‌న్నిపై షారూక్ ప్ర‌శ‌సంలు

బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్ర‌శంస‌లు వ‌ర్షం కురిపించాడు.

'వ‌ర్మ' రిలీజ్ ఫిక్స‌య్యింది

తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సందీప్‌రెడ్డి వంగా కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది.