పేట తెలుగు వ‌ర్ష‌న్.. జ‌న‌వ‌రి 10న విడుద‌ల‌..

  • IndiaGlitz, [Friday,December 28 2018]

ప్రముఖ నిర్మాత అశోక్ వల్లభనేని పేట తెలుగు రైట్స్ సొంతం చేసుకున్నారు. ఈయన గతంలో విజయ్ సర్కార్.. మణిరత్నం నవాబ్ సినిమా హక్కులను తెలుగులో తీసుకున్నారు. ఇప్పుడు పేట హక్కులను 21 కోట్లకు సొంతం చేసుకున్నారు. భారీ పోటీ మధ్య ఈ డీల్ సొంతం చేసుకున్నారు అశోక్. ఈ సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేయాల‌ని చూస్తున్నారు ఈ నిర్మాత‌. తెలుగులో ఈ చిత్రాన్ని భారీగా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు నిర్మాత అశోక్.

పేట సినిమా ర‌జినీకాంత్, కార్తిక్ సుబ్బ‌రాజ్ కాంబినేష‌న్ లో వ‌స్తుంది. సూపర్ స్టార్ కు తెలుగులో ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సినిమాకు హెల్ప్ కానుంది. రజిని ఈ సినిమా కోసం చాలా మేకోవర్ అయ్యారు. ఇదివరకు ఏ సినిమాలో కనిపించని విధంగా ఇందులో కొత్తగా ఉన్నారు సూపర్ స్టార్. సిమ్రాన్, త్రిష, విజయ్ సేతుపతి, బాబీ సింహా, శ‌శికుమార్, మేఘా ఆకాష్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ పేట సినిమాతోనే దక్షిణాది సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ చేస్తుండగా.. సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించింది. జనవరి 10న విడుదల కానుంది పేట.

న‌టీన‌టులు: సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, సిమ్రాన్, త్రిష, నవాజుద్దీన్ సిద్దిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా, శ‌శికుమార్, మేఘా ఆకాష్..