రాణాతో ఫోటో దిగడం ఇప్పుడు చాలా ఈజీ

  • IndiaGlitz, [Wednesday,July 19 2017]

స్టార్లతో ఫోటోలు దిగడానికి సగటు సినిమా అభిమానులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కానీ.. ఇకపై స్టార్ హీరోతో ఫోటో దిగడం సులభతరం చేసింది యాప్ స్టర్. "నేనే రాజు నేనే మంత్రి" సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. "యాప్ స్టర్" అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని మల్టీప్లెక్స్ లో పెట్టిన ఏదైనా "నేనే రాజు నేనే మంత్రి" ఫ్లెక్స్ దగ్గరకెళ్లి.. సదరు ఫ్లెక్సీ స్టాండ్ పై ఉన్న కోడ్ ను స్కాన్ చేస్తే.. రాణావి కొన్ని ఫోజులు ఆగుమెంటెడ్ రియాలిటీలో మొబైల్ ఫోన్ లో కనిపిస్తాయి. రాణా ఫోజ్ కి తగ్గట్లుగా నిల్చోని నిజంగా రాణాతో ఫోటో దిగినట్లుగా ఔట్ పుట్ వస్తుంది. ఫోటో చూస్తే నిజంగా రాణాతో ఫోటో దిగినట్లే ఉంటుంది.

ఈ ఆగుమెంటెడ్ రియాలిటీతో "నేనే రాజు నేనే మంత్రి" ప్రమోషన్స్ లో సరికొత్త ట్రెండ్ మొదలైంది.

ఈ లేటెస్ట్ ట్రెండింగ్ ప్రమోషన్ కు సంబంధించిన ప్రెస్ మీట్ ను నేడు హైద్రాబాద్ లో బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేతలు భరత్ చౌదరి-వి.కిరణ్ రెడ్డిలతోపాటు సురేష్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మొట్టమొదటిగా ఈ ఆగుమెంటెడ్ రియాలిటీతో రాణాతో ఫోటో దిగారు.

ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న "నేనే రాజు నేనే మంత్రి"లో రాణా సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించగా.. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత సారధ్యం వహించారు!

More News

ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా టీమ్-5 విడుదల

భారత జాతీయ క్రికెటర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీశాంత్, ఇప్పుడు టీమ్-5 అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం కానున్నాడు. సురేష్ గోవింద్ దర్శకత్వం వహిస్తున్న టీమ్-5 చిత్రంలో కన్నడ భామ నిక్కీ గర్లాని కథానాయికగా నటిస్తోంది.

బృందావనమది అందరిది మూవీ తో దర్శకుడిగా మారుతున్న రచయిత శ్రీధర్ సీపాన

పలు సూపర్ హిట్ చిత్రాలకు సంభాషణలు అందించిన రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారబోతున్నారు. నూతన నటీనటులతో ఆయన తన తొలి సినిమాను రూపొందించనున్నారు. ఈ చిత్రానికి బృందావనమది అందరిది అనే టైటిల్ ను ఖరారు చేశారు.

'వైశాఖం' బి.ఎ.రాజుగారికి, జయగారికి మంచి పేరు తెస్తుంది - కింగ్ నాగార్జున

ఆర్.జె. సినిమాస్ బేనర్పై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'వైశాఖం`. ఈ సినిమా జూలై 21న విడుదలవుతుంది.

చెర్రీ దంపతులు పెద్ద మనసు

పరాయి రాష్ట్రం అస్సాంలో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జన జీవనం స్తంభించింది. వరదల కారణంగా 65 మంది మరణించారు. ప్రజలు కనీస అవసరాలైన తిండి, నీరు లేక ఇబ్బందలు పడుతున్నారు.

రామ్ చరణ్ కొత్త ఆలోచన...

మెగాపవర్స్టార్ రామ్చరణ్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న `రంగస్థలం 1985` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నాడు.