'పిచ్చిగా నచ్చావ్' ట్రైలర్ ఆవిష్కరణ

  • IndiaGlitz, [Thursday,March 09 2017]

''ప్రేమన్నది యూనివర్సెల్‌. కానీ ప్రేమలో ఉన్న ప్రతి మనిషి తనదైన శైలిలో నిర్వచనం చెబుతుంటారు. అంటే ప్రేమ అన్నది వ్యక్తిగతం కూడా. చిన్న విషయాన్ని కూడా అర్ధం చేసుకోకుండా నేటి యువత కోపం, ఈర్ష్య, ద్వేషం పెంచుకుపోతున్నారు. దీని వల్ల మనుషులు, మనసులు విడిపోతున్నాయి. అలాంటి అయోమయంలో ఇరుక్కున్న ఓ యువకుడు ప్రేమకు సరైన నిర్వచనం తెలుసుకుని తన వల్ల జరిగిన పొరపాటుని ఎలా సరిదిద్దుకున్నాడు? తన జీవితాన్ని అందంగా ఎలా మలుచుకున్నాడు అన్నది తెరపైనే చూడాలంటున్నారు'' దర్శకుడు వి.శశిభూషణ్‌. సంజీవ్‌, చేతన ఉత్తేజ్‌, నందు, కారుణ్య నటీనటులుగా శ్రీవత్స క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'పిచ్చిగా నచ్చావ్‌'. వి.శశిభూషణ్‌ దర్శకుడు. కమల్‌కుమార్‌ పెండెం నిర్మాత. బుధవారం హైదరాబాద్‌లో అవసరాల శ్రీనివాస్‌ చేతులమీదుగా థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ బావుందని సినిమా విజయవంతంగా ఆడాలని అవసరాల శ్రీనివాస్‌ ఆకాంక్షించారు.

నిర్మాత కమల్‌కుమార్‌ పెండెం మాట్లాడుతూ ''ప్రేమకథలో రూపొందుతున్న చిత్రమిది. కుటుంబ విలువలతో వల్గారిటీ లేకుండా లావిష్‌గా రూపొందించాం. ఇటీవల వరంగల్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో విడుదల చేసిన పాటలకు, ప్రోమోలకు చక్కని స్పందన వచ్చింది. సోషల్‌ మీడియాలో ప్రచార చిత్రాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 17 న సినిమాను విడుదల చేస్తున్నాం '' అని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ ''ఇటీవల విడుదల చేసిన పోస్టర్లు, ప్రోమోలతో సినిమాకు క్రేజ్‌ పెరిగింది. రొమాంటిక్‌ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇందులో మెగా బ్రదర్‌ నాగబాబు కీలకమైన పాత్ర పోషించారు. నా ఐడియాను నమ్మి నిర్మాత అవకాశం ఇచ్చారు. మొదటి సినిమాకు చక్కని నిర్మాత దొరకడం నా అదృష్టం. ఎంచుకున్న కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, ఫోటోగ్రఫీ, నిర్మాణ విలువలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. విందు భోజనంలాంటి సినిమా అవుతుంది'' అని అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: వెంకట హనుమ, సంగీతం: రాం నారాయణ, ఆర్ట్‌: రమేష్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: పుచ్చా రామకృష్ణ, సమర్పణ: శ్రీమతి శైలజ.

More News

కిట్టుగాడి విజయ యాత్ర

వరుస విజయాలతో సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్న యువ కథానాయకుడు రాజ్ తరుణ్ హీరోగా, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్గా ఏటీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వంశీకృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర దర్శకత్వంలో రూపొందించిన హిలేరియస్ ఎంటర్టైనర్ `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`.

జాహ్నవి ఫిలింస్ బ్యానర్ లో అల్లరి నరేష్ కొత్త చిత్రం

మలయాళం లో ఘన విజయం సాధించిన 'ఓరు వడక్కన్ సెల్ఫీ' చిత్రం అల్లరి నరేష్ హీరోగా తెలుగులో రీమేక్ కాబోతుంది. జాహ్నవి ఫిలింస్ బ్యానర్పై శ్రీమతి నీలిమ సమర్పణలో చంద్రశేఖర్ బొప్పన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. 'ఓరు వడక్కన్ సెల్ఫీ' మలయాళ మాతృక చిత్రాన్ని డైరెక్ట్ చేసిన జి. ప్రజీత్ ఈ రీమేక్కి దర్శకత్వం వహించనున్నారు.

రాజశేఖర్ కుమార్తెను పరిచయం చేయనున్న దర్శకుడు

చిత్రం, జయం, నువ్వు నేను వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు తేజ ఇప్పుడు రానా, కాజల్ హీరో హీరోయిన్లుగా ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం ప్రారంభం

బాలకృష్ణ, పూరి జగన్నాథ్ అంటేనే క్రేజీ కాంబినేషన్. హీరోయిజంను డిఫరెంట్ స్టయిల్లో ప్రెజెంట్ చేసే దర్శకుడు పూరి, వంద చిత్రాలతో తెలుగు సినిమా రంగంలో తండ్రికి తగ్గ తనయుడుగా రాణిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా గురువారం ఉదయం ప్రారంభమైంది.

రాంగోపాల్ వర్మపై గోవాలో కేసు...

ఉమెన్స్డే సందర్భంగా శుభాకాంక్షలు చెబితే ఎవరిపై అయిన కేసు పెడతారా..కానీ కేసు పెట్టారు. ఇంతకు కేసు పెట్టిన వ్యక్తి గోవా హిందు జాగృతి సంస్థకు చెందిన కరగోన్కర్. మరి ఇంతకు కేసు ఎవరుపై పెట్టారో తెలుసా..రాంగోపాల్ వర్మపై.