close
Choose your channels

చంద్రబాబూ.. మగాడివైతే రా తేల్చుకుందాం: పిన్నెల్లి

Tuesday, January 7, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చంద్రబాబూ.. మగాడివైతే రా తేల్చుకుందాం: పిన్నెల్లి

వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌పై రైతులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పిన్నెల్లి మీడియా మీట్ నిర్వహించి టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. రైతుల ముసుగులో టీడీపీ గుండాలకు మద్యం తాపించి చంద్రబాబు తన కాన్వాయ్‌పై దాడి చేయించాడని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా.. చంద్రబాబుకు మగతనం ఉంటే.. ఎక్కడకు రావాలో చెప్పు తేల్చుకుందామని ఓపెన్‌ చాలెంజ్‌ విసిరారు. దమ్ముంటే చంద్రబాబు ధైర్యంగా ముందుకు రావాలన్నారు. ‘నా కారుపై, గన్‌మెన్‌పై దాడి చేసిన వారు ఎవరూ అమరావతి రైతులు కాదు. వాళ్లంతా టీడీపీ గుండాలే.. రాజధాని ముసుగులో చంద్రబాబు అరాచకం సృష్టిస్తున్నారు. చంద్రబాబుకు చేతగాక రైతుల ముసుగులో దాడులు చేయిస్తున్నాడని, భూ కుంభకోణాలు బయటపడతాయనే దాడులు చేయిస్తున్నాడు. చాలా సంయమనం పాటించామని, ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి కూడా వివరించాం’ అని పిన్నెల్లి మీడియా వెల్లడించారు.

అసలేం జరిగిందో పిన్నెల్లి మాటల్లోనే!
‘నేను విజయవాడకు వెళ్తుంటే హైవే మీద ధర్నా చేస్తున్నారు. నేను వెళ్తుంటే నా కారుకు కొంతమంది అల్లరి మూకలు అడ్డుతగిలి రాళ్లు వేసి కారును ధ్వంసం చేశారు. ఇదంతా గత పది రోజులుగా చూస్తుంటే రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య క్రియేట్‌ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజధాని ప్రాంతంలో రైతుల మీద సానుభూతి ఉంది. సమస్య ఉంటే వాళ్లు ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి చర్చ చేస్తే న్యాయంగా ఉంటుంది. చంద్రబాబు ఆయన ట్రాప్‌లో పడేసి రైతుల ముసుగులో దాడి చేయడం దుర్మార్గం. చంద్రబాబుకు, ఆయన చెంచాలకు ఒకటే చెబుతున్నా, చాలెంజ్‌ చేస్తున్నా.. నా కారుపై రాళ్లు వేసి, నా గన్‌మెన్‌పై దాడి చేసిన వారు ఎవరూ అమరావతి రైతులు కాదు. బయట నుంచి వచ్చిన కొంతమంది గుండాలకు మద్యం తాగించి ఈ చర్యలు ఉసిగొల్పాడు. ఇలాంటి పరిస్థితి మంచిది కాదు’ అని ప్రభుత్వ విప్ చెప్పుకొచ్చారు.

భయపడే ప్రసక్తే లేదు..!
‘3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి గ్రామంలో ప్రతి వర్గాన్ని, ప్రాంతాల ప్రజల కష్టాలను కళ్లారా చూశారు. అన్యాయం చేయాలనే ఆలోచన సీఎం జగన్‌కు ఏ కోశాన లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ధృడ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. ఆయన ఎమ్మెల్యేలుగా చెబుతున్నాం.. మా నాయకుడు ఎంత ధృడ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారో అదే తోవలో మేము నడుస్తున్నాం. ఇలాంటి తాటాపు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు. పల్నాడు ప్రాంతంలో లోకేష్‌ బినామీ యరపతినేని శ్రీనివాస్‌ను అడ్డంపెట్టుకొని నన్ను భయపెట్టాలని చూశాడు. ఆ రోజే ఉడత ఊపులకు భయపడలేదు. నిజంగా నువ్వు మగాడివి అయితే.. నీ కొడుక్కు మగతనం ఉంటే ఓపెన్‌గా చాలెంజ్‌ చేస్తున్నాను.. రాజధాని రైతులను అడ్డం పెట్టుకొని కొంతమందికి తాపించే దాడి చేయించడం సమంజసం కాదు. గన్‌మెన్‌పై కూడా దాడి చేశారు. ఎవరైతే బయట నుంచి వచ్చారో.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరాను. ఫిర్యాదు కూడా చేయనున్నాను’ అని పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి మీడియాకు నిశితంగా వివరించారు.

ఖండించిన ఎమ్మెల్యేలు!
ఇదిలా ఉంటే పిన్నెల్లి జరిగిన దాడిన వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. పిన్నెళ్లిని చంపేసే ప్రయత్నం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. మరో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో హింసను ప్రేరేపించేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. ప్రభుత్వ విప్‌ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై జరిగిన దాడిలో టీడీపీ హస్తం ఉందన్నారు. రైతుల ముసుగులో టీడీపీ గుండాలను పంపించి దాడికి పాల్పడ్డారన్నారు. ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. పిన్నెళ్లిని కాదు.. మోసం చేసిన చంద్రబాబును కొట్టాలని రాజధాని రైతులకు ఆమె సూచించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.