తెర‌పైకి మ‌రాఠా యోధుడి చిత్రం

  • IndiaGlitz, [Thursday,February 20 2020]

భార‌తదేశంలో హిందుత్వ ఉనికి కోసం నాటి మొఘ‌లు చ‌క్ర‌వ‌ర్తుల‌తో పోరాటం చేసిన మ‌రాఠా యోధుడు ఛ‌త్ర‌ప‌తి శివాజీ. ముఖ్యంగా ఔరంగజేబుని గ‌డ‌గ‌డ‌లాడించాడు శివాజీ. ఈయ‌న జీవితం సినిమా రూపంలో తెర‌కెక్క‌నుంది. ఈ విష‌యాన్ని హీరో రితేష్ దేశ్‌ముఖ్ అధికారికంగా ప్ర‌క‌టించారు. సైర‌ట్ ద‌ర్శ‌కుడు నాగ‌రాజ్ మంజులే ఈచిత్రాన్ని డైరెక్ట్ చేయ‌నున్నారు. సంగీత ద్వ‌యం అజ‌య్- అతుల్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హించ‌నున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందించ‌నున్నారు. మొద‌టి భాగానికి శివాజీ అని.. రెండో భాగానికి రాజా శివాజీ అని, మూడో భాగానికి ఛ‌త్ర‌ప‌తి శివాజీ అనే టైటిల్స్‌ను ఖ‌రారు చేశారు. తొలి భాగం 2022లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించ‌డం విశేషం.

పాన్ ఇండియా చిత్రంగా సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు. బ్ర‌హ్మాస్త్ర త‌ర్వాత మూడు భాగాలుగా రూపొంద‌నున్న చిత్ర‌మిదే. బుధ‌వారం ఛ‌త్ర‌ప‌తి శివాజీ జ‌యంతి సంద‌ర్భంగా చిత్ర యూనిట్ సినిమా గురించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రిచింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు చిత్రాల్లో శివాజీ పాత్ర‌ను చూఛాయ‌గా చూపించారు కానీ.. ఆయ‌న పాత్ర గొప్ప‌త‌నాన్ని ఎక్కువ‌గా ఎక్క‌డా ఆవిష్క‌రించ‌లేదు. కానీ తొలిసారి ఆయ‌న బ‌యోపిక్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి సినిమాను ఎంత ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కిస్తార‌నేది తెలియాల్సి ఉంది.

More News

నేనెవరో తెలీదా.. జగన్ సెక్యూరిటీతో బైరెడ్డి సిద్ధార్థ్‌ వాగ్వాదం!

యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. వయసు చిన్నదే అయినప్పటికీ మాస్ ఫాలోయింగ్ ఉన్న ఈ యువకుడు కర్నూలు జిల్లాలో కీలకంగా ఉన్నాడు.

‘ఆర్ఆర్ఆర్’ కోసం బాలీవుడ్ టెక్నిక్‌లో రాజ‌మౌళి..!

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’. డి.వి.వి.దాన‌య్య నిర్మాత‌.

ప్రాణాలతో బయటపడ్డా.. తెలిసొచ్చింది: కాజల్

విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భారతీయుడు-2’.

'ఇండియ‌న్ 2' సెట్స్‌లో భారీ ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు-2’ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్

'మిస్ ఇండియా' కు ముహూర్తం కుదిరింది

‘మహానటి’తో జాతీయ ఉత్త‌మ‌న‌టి అవార్డుని ద‌క్కించుకున్న కీర్తిసురేశ్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ మిస్ ఇండియా.