close
Choose your channels

సీబీఐ కోర్టులో జగన్‌కు చుక్కెదురు.. కోర్టుకు రావాల్సిందే!

Friday, November 1, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీబీఐ కోర్టులో జగన్‌కు చుక్కెదురు.. కోర్టుకు రావాల్సిందే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు ఊహించని షాకిచ్చింది. కోర్టు విచారణకు హాజరవడంపై మినహాయింపును ఇవ్వాలంటూ ఆయన పిటిషన్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పిటిషన్‌ను శుక్రవారం నాడు విచారించిన కోర్టు తీర్పును వెలువరించింది. మినహాయింపు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు కోర్టు తేల్చిచెప్పింది. కోర్టు విచారణకు ప్రతి శుక్రవారం రావాల్సిందేనని కోర్టు ఆదేశించింది. ఇందుకు కారణాలను సైతం కోర్టు నిశితంగా వివరించింది.

పరిస్థితులు మారాయని నేరంలో ఎలాంటి మార్పు లేదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. వైఎస్ జగన్‌ ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేయడానికి యత్నించారని.. అలాంటిది ఇప్పుడు ఆయన సీఎం స్థానంలో ఉన్నారన్న విషయాన్ని కోర్టుకు సీబీఐ అధికారులు గుర్తు చేశారు. అధికారులంతా ముఖ్యమంత్రి మాటను వినాల్సి ఉంటుందని, ఆయనకు వ్యక్తిగత మినహాయింపును ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలిపింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు... జగన్‌కు వ్యక్తిగత మినహాయింపును ఇవ్వలేమని తెలిపింది. కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని ఆదేశించింది.

ఇదిలా ఉంటే.. తాను ముఖ్యమంత్రిగా ఉన్నానని... ఒక రోజు కోర్టుకు వస్తే తన ప్రొటోకాల్, సెక్యూరిటీ కోసం రూ. 60 లక్షలు ఖర్చవుతుందని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, దీంతో పెద్ద ఎత్తున ప్రజాధనం ఖర్చవుతుందని పిటిషన్‌లో జగన్ పేర్కొన్న విషయం విదితమే. దీనికి తోడు, ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావడం ఇబ్బందని పిటిషన్‌లో తెలిపారు. అయితే ఈ క్రమంలో జగన్, ఆయన తరఫు న్యాయవాది ఏం చేయబోతున్నారనే దానిపై ఏపీ రాజకీయాల్లో, వైసీపీలో చర్చనీయాంశమవుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.