దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి:  రజినీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని రీసెంట్‌గా తెలియజేసిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి వస్తానని రజనీకాంత్‌ తెలియజేసిన కొన్ని రోజులకు ఆయన హై బీపీతో ఇబ్బంది పడ్డారు. డాక్టర్స్ సూచన మేరకు టెన్షన్స్‌కు దూరంగా ఉండాలనుకున్న తలైవా రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు తెలియజేశారు. అయితే దీనిపై రజినీకాంత్‌ అభిమానులు నిరాశకు లోనయ్యారు. రజినీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలంటూ చెన్నైలో ఆందోళన ప్రారంభించారు. దీంతో మరోసారి రజినీకాంత్‌ తన రాజకీయాల్లోకి రావడంపై స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఒక లేఖను రాసి పోస్ట్‌ చేశారు. అందులో ఆయన ఏం చెప్పారంటే..

నన్ను బతికిస్తున్న దేవుళ్లయిన అభిమానులకు, రాజకీయాల్లోకి రావడం పట్ల నా నిర్ణయాన్ని మరోసారి పరిశీలించుకోవాలని కొందరు, కొందరు నా అభిమాన సంఘంలోని వ్యక్తులు చెన్నైలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.దీన్ని క్రమశిక్షణా బద్ధంగా, గౌరవప్రదంగా నిర్వహించారు. అందుకు వారికి నా కృతజ్ఞతలు. అయితే నేను అధ్యక్షకుడినయినప్పటికీ.. నా ఆదేశాలను అతిక్రమించి సమావేశాన్ని నిర్వహించడం బాధాకరం. మండ్రం నిర్వాహకుల అభ్యర్ధనను గుర్తించి, గౌరవించి ఈ కార్యక్రమంలో పాల్గొనని వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు రాలేకపోతున్నాననే విషయాన్ని ఇదివరకే పూర్తిగా వివరించాను. నేను నా నిర్ణయాన్ని అప్పుడే ప్రకటించాను. దయచేసి ఇంకెవ్వరూ ఇలాంటి సమావేశాలను నిర్వహించి, నన్ను రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించి ఇబ్బంది పెట్టవద్దు అని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను అని తెలిపారు రజినీకాంత్‌.

More News

రాష్ట్రాలకు నేడు కరోనా వ్యాక్సిన్.. సాయంత్రంలోపు హైదరాబాద్‌కు..

అన్ని రాష్ట్రాలకు ఇవాళ కరోనా వ్యాక్సిన్‌ను కేంద్రం పంపిణీ చేయనుంది. పుణె నుంచి అన్ని రాష్ట్రాలకు కొవిషెల్డ్ వ్యాక్సిన్‌ను పంపించనున్నారు.

మెగాస్టార్ ఆ సెంటిమెంటును ఫాలో అవుతారా?

సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు పెద్ద పీట వేస్తారనడంలో సందేహం లేదు. అలాగే మెగాస్టార్ కూడా సినిమా రిలీజ్ విషయంలో సెంటిమెంటను ఫాలో అవుతారని టాక్ నడుస్తోంది.

లాక్‌డౌన్ మహత్స్యం.. హైదరాబాద్‌లో తగ్గిన కాలుష్యం..

లాక్‌డౌన్ పుణ్యమాని 2019తో పోలిస్తే హైదరాబాద్‌లో కాలుష్యం చాలా వరకూ తగ్గంది.

బాబాయ్ బాట‌లో ఎన్టీఆర్‌... అలాంటి టైటిల్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ట్రిపులార్ త‌ర్వాత త‌దుప‌రి సినిమాను ట్రాక్ ఎక్కించ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

సత్తా చాటిన రైతులు.. ఏకంగా సీఎం హెలీప్యాడ్‌నే...

హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కి అక్కడి రైతులు తమ సత్తా ఏంటో చూపించారు. పోలీసుల ఫిరంగులు, బాష్పవాయువును సైతం లెక్కచేయలేదు.