close
Choose your channels

పీవోకే భారత్‌లో అంతర్భాగమే.. ఎలా స్వాధీనం చేసుకోవాలో తెలుసు!

Tuesday, August 6, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పీవోకే భారత్‌లో అంతర్భాగమే.. ఎలా స్వాధీనం చేసుకోవాలో తెలుసు!

కశ్మీర్‌ విభజన బిల్లుపై మంగళవారం నాడు సుధీర్ఘ చర్చ సాగింది. ఈ సందర్భంగా మొదట లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం పలు పార్టీలకు చెందిన ఎంపీలు దీనిపై మాట్లాడారు. అయితే కొందరు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించగా.. మరికొందరు మాత్రం అమిత్‌షా-మోదీ ఇద్దరూ కీలక నిర్ణయం తీసుకున్నారని శభాష్ అని మెచ్చుకున్నారు. ఎంపీల ప్రసంగం అనంతరం షా సుధీర్ఘ ప్రసంగం మొదలుపెట్టారు. సుమారు గంటన్నరకు పైగా షా ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చుకున్నారు. ఆర్టికల్‌ 370 కారణంగానే భారత్‌ నుంచి కశ్మీర్‌ను వేరుగా చూశారని.. ఆర్టికల్‌ 370 రద్దుతో 70 ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. ప్రధాని మోదీది సాహసోపేతమైన నిర్ణయమని ఈ సందర్భంగా షా ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ తీసుకున్న నిర్ణయం వల్లే సమస్యకు పరిష్కారం లభించిందని.. పరిస్థితులన్నీ చక్కబడగానే కశ్మీర్‌కు రాష్ట్రహోదా ఇస్తామని అమిత్ షా తేల్చిచెప్పారు.

ఆపరేషన్ పీవోకే..!

ఈ సందర్భంగా పీవోకే గురించి మాట్లాడిన అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పీవోకే భారత్‌లో అంతర్భాగమేనని.. ఎవరి ఒత్తిళ్లకు మోదీ ప్రభుత్వం తలొగ్గదని తేల్చిచెప్పారు. అంతేకాదు.. రాజకీయ దురుద్దేశంతో చేసే విమర్శలు పట్టించుకోమన్న ఆయన.. పీవోకేను ఎలా స్వాధీనం చేసుకోవాలో కేంద్ర ప్రభుత్వానికి తెలుసన్నారు. నెహ్రూ విధానాల వల్లే పీవోకే భారత్‌ నుంచి చేజారిందని నాటి ప్రభుత్వంపై షా విమర్శలు గుప్పించారు. షా వ్యాఖ్యలను బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం తదుపరి టార్గెట్ ‘పీవోకే’.. త్వరలోనే ‘ఆపరేషన్ పీవోకే’ను ప్రారంభించించనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

పాక్‌ తొత్తులతో ఎలాంటి చర్చలు జరపబోం!

"లోయలో ఉన్నవాళ్లంతా మా వాళ్లే. లోయలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం ఏం చేయాలో మేం చేస్తాం. కశ్మీర్‌లో ఉగ్రవాదానికి పాకిస్థానే కారణం. పాక్‌ తొత్తులతో ఎలాంటి చర్చలు జరపబోం. 370 రద్దుపై ఎప్పుడు చర్చ జరిగినా ప్రజలంతా మోదీని గుర్తు చేసుకుంటారు. చర్చలు లేకుండానే బిల్లులు ఆమోదిస్తున్నారని విమర్శిస్తున్నారు. 70 ఏళ్లుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్‌ నుంచి ప్రేరణ పొందినవారితో చర్చలు జరపాలా?. పాక్‌ కుటిల నీతి వల్లే కశ్మీర్‌లో యువత ఆయుధాలు పట్టుకుంది. మేం ప్రజాస్వామ్య పద్ధతుల ప్రకారం ముందుకెళ్తున్నాం. 370 రద్దు నిర్ణయం మంచిదా? చెడ్డదా? అనేది భవిష్యత్‌ నిర్ణయిస్తుంది. ఆర్టికల్‌ 370ని 371తో పోల్చవద్దు" అని ఈ సందర్భంగా షా తేల్చిచెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.