అన‌సూయ‌ను అభినందించిన పోలీసులు

  • IndiaGlitz, [Friday,May 15 2020]

జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగామ్‌తో పాపులారిటీ సంపాదించుకున్న యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ పుట్టిన‌రోజు నేడు(మే 15). ఈ సంద‌ర్భంగా అన‌సూయ కీస‌ర మండ‌లంలోని ప‌లువురు గ‌ర్భిణీల‌కు న్యూటిష‌న్ కిట్ల‌ను పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆమెతో పాటు ఆమె భ‌ర్త సుశాంక్ భ‌ర‌ద్వాజ్ కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గ‌ర్భిణుల‌కు న్యూటిష‌న్ కిట్ల‌ను అంద‌జేయ‌డం త‌న‌కు ఎంతో ఆనందానిచ్చింద‌ని అన‌సూయ తెలిపారు. గ‌ర్భిణుల‌కు ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో స‌మ‌ర్ధ‌వంతమైన పోష‌కాలు అందించ‌డానికి వారిలో ధైర్యాన్ని నింప‌డానికి తాము ఈ కార్యాన్ని చేప‌ట్టిన‌ట్లు చెప్ప‌డ‌మే కాకుండా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అన‌సూయ‌ను రాచ‌కొండ పోలీసులు అభినందించారు.

రాచకొండ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ అన‌సూయ‌ను అభినందించారు. గ‌ర్భిణులు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాన్ని తీసుకోవాల‌ని, ఏదైనా స‌హాయం కావాల‌ని కోవిడ్ కంట్రోల్ నెంబ‌ర్‌ను కాంటాక్ట్ చేయాల‌ని కోరారు. సోష‌ల్ మీడియాలో ప‌లువురు అన‌సూయ‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. అలాగే అన‌సూయ బుల్లితెర నుండి వెండితెర‌పై కూడా అడుగు పెట్టారు. ప‌లు చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు, స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టించారు. అన‌సూయ న‌టించిన చిత్రాల్లో క్ష‌ణం, రంగ‌స్థ‌లం సినిమాల్లో అన‌సూయ పోషించిన పాత్ర‌ల‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌లు అన‌సూయ‌ను దృష్టిలో పెట్టుకుని పాత్ర‌ల‌ను క్రియేట్ చేస్తున్నారు.

More News

బాలీవుడ్ విల‌న్‌తో బాల‌కృష్ణ‌..?

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం

వ‌రుస సినిమాలు ప్లాన్ చేస్తున్న మంచు విష్ణు

మంచు మోహ‌న్‌బాబు త‌న‌యుడైన మంచు విష్ణు ఆచార్య అమెరికా యాత్ర త‌ర్వాత ఏడాదికిపైగానే సినిమా చేయ‌లేదు. గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఏకంగా నాలుగు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు.

స‌హ‌జీవ‌నాన్ని కన్‌ఫర్మ్ చేసిన గోపీసుందర్

జాతీయ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ గోపీ సుంద‌ర్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడే. ఈయ‌న త‌న భార్య ప్రియ నుండి విడిపోతున్నాడ‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు విన‌ప‌డుతూ వ‌చ్చాయి.

‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’ రిలీజ్ గురించి నిర్మాత క్లారిటీ

క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 1’. ఈ సినిమా రెండో పార్టుగా ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’ సెట్స్‌పై ఉంది.

ఆహా కోసం అర‌వింద్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలు..!

ఓటీటీ మాధ్య‌మాలు జోరును ముందుగానే ఊహించిన తెలుగు నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ ఒక‌రు. అందుక‌నే ఆయ‌న తెలుగులో ఆహా అనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసి తీసుకొచ్చారు.