మోహన్‌బాబు కుటుంబ సభ్యులను హెచ్చరించిన దుండగుల అరెస్ట్

  • IndiaGlitz, [Sunday,August 02 2020]

ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు ఫాం హౌస్ వద్ద నిన్న రాత్రి కలకలం రేగింది. జల్పల్లిలోని ఆయన ఫాంహౌస్‌లోకి గత రాత్రి ఓ కారు ఆయన ఇంట్లోకి దూసుకెళ్లింది. కారులో నలుగురు వ్యక్తులున్నారు. మిమ్మల్ని వదలబోమంటూ మోహన్‌బాబు కుటుంబ సభ్యులకు హెచ్చరించారు. దీంతో భయాందోళనకు లోనైన మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పహడీషరీఫ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఏపీ 3 ఏఎన్ 0004 నంబరున్న ఇన్నోవా కారులో దుండగులు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. .. సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు.. కారు నంబర్ ఆధారంగా పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. మైలార్‌దేవులపల్లిలోని దుర్గానగర్‌కు చెందిన యువకులుగా గుర్తించారు. అగంతకుల కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. విచారణ కొనసాగుతోంది. మోహన్‌బాబు ఇంటి వాచ్‌మెన్ అప్రమత్తంగా లేకపోవడం వల్లే వారు లోనికి వచ్చినట్లు తెలిసింది.

More News

చిరు బర్త్‌డేకు స్పెషల్ గిఫ్ట్ సిద్ధం చేస్తున్న రామ్ చరణ్ యువశక్

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అయిన ఆగస్ట్ 22 కోసం రామ్ చరణ్ యువశక్తి ఇప్పటి నుంచే గిఫ్ట్‌ను సిద్ధం చేస్తోంది.

తెలంగాణలో నేడు 1891 కేసులు..

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం కరోనా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

ఏపీలో లక్షన్నర దాటిన కరోనా కేసులు.. నేడు ఎన్నంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు లక్షన్నర దాటేశాయి. అయితే గత నాలుగు రోజులతో పోలిస్తే నేడు మాత్రం కేసుల సంఖ్య కాస్త తగ్గింది.

సింగపూర్‌లో చికిత్స పొందుతూ అమర్ సింగ్ మృతి

రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్(64) మృతి చెందారు. ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సింగపూర్‌లో చికిత్స పొందుతున్నారు.

‘వకీల్‌సాబ్‌’కు డేట్స్ కేటాయించిన శృతి..!

రెండేళ్ళ క్రితం వరకు స్టార్ హీరోయిన్ హోదాలో ఓ వెలుగు వెలిగిన క‌థానాయిక శృతి హాసన్.