హైదరాబాద్ మరో అద్భుతం.. ఇక నేరగాళ్ల పని అంతే, అతి త్వరలో..

  • IndiaGlitz, [Monday,June 28 2021]

హైదరాబాద్ లో మరో అద్భుత ఆవిష్కరణకు సమయం ఆసన్నమైంది. హైదరాబాద్ ఖ్యాతిని పెంచేలా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ట్విన్ టవర్స్ నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాణం తుది దశకు చేరుకుంది. దాదాపు 450 కోట్లకు పైగా వ్యయంతో ఈ నిర్మాణం చేపడుతున్న సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: 8 జిల్లాల్లో ఏపీలో కర్ఫ్యూ సడలింపు.. కొత్త నిబంధనలు ఇవే!

కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి రాగానే..ఒక లక్ష 12 వేల 77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న తెలంగాణలోని ప్రతి అంగుళం ఇక 360 డిగ్రీల కోణంలో పోలీస్‌ రాడార్‌ పరిధిలోకి వస్తుంది. దీనితో తెలంగాణ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా మారనుంది.

తెలంగాణలో ఏ మూల ఏం జరిగినా పోలీసులు పసిగట్టేలా ఈ వ్వవస్థ పనిచేయనుంది. దీనితో నేరాలని పూర్తిగా అదుపులోకి తీసుకురావచ్చు. మొదట కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి 350 కోట్లు అవసరం అవుతుంది అని అంచనా వేశారు. ఆ తర్వాత దీని బడ్జెట్ 450 కోట్లకు చేరింది. తాజాగా మరో 200 కోట్లు అదనంగా ఖర్చయినట్లు తెలుస్తోంది.

ఏడు ఎకరాల్లో 7 లక్షల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో ఏ, బీ, సీ, డీ నాలుగు బ్లాకులుగా కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ టవర్లు నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. హెలిప్యాడ్ సౌకర్యం కూడా ఉంటుంది. ఓపెన్‌ ఆఫీస్‌, మీటింగ్‌ రూమ్స్‌, కాన్ఫరెన్స్‌ రూం, క్యాబిన్లు ఉంటాయి. ముఖ్యమంత్రి, హోంమంత్రి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ క్యాబిన్లు, మల్టీపర్పస్‌ హాల్‌, హెలీప్యాడ్‌ టవర్‌-ఏలోనే ఉంటాయి. టవర్‌ -బీని జీ ప్లస్‌ 15గా నిర్మించారు. ఇందులో ఓపెన్‌ ఆఫీస్‌, మీటింగ్‌ రూమ్స్‌, కాన్ఫరెన్స్‌ రూం, క్యాబిన్స్‌, డీజీపీ, సీఎస్‌ క్యాబిన్లు, డయల్‌-100 ఉంటాయి.

టవర్‌-డీలో మీడియా సమావేశం నిర్వహణతోపాటు క్యాంటీన్‌, శిక్షణా గదులు, మంత్రుల క్యాబిన్లు, వార్‌ రూం ఉంటాయి. టవర్లలో ఒకదాని నుంచి మరోదానికి చేరుకునేందుకు వీలుగా స్కైవేలు నిర్మించారు. కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను టెక్నాలజీ ఫ్యూజన్‌ సెంటర్‌గా రూపుదిద్దుతున్నాం. జిల్లాల్లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్లతో ఈ సెంటర్‌ అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ఇది నెట్‌వర్క్‌ ఆఫ్‌ కమాండ్‌ సెంటర్స్‌గా మారుతుంది. ప్రభుత్వ సహకారం, ప్రజలు, నాయకుల భాగస్వామ్యంతో రాష్ట్రంలో 8 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం అని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు.

More News

వందల కోట్లల్లో ఈ చిత్రాల పెట్టుబడి.. థర్డ్ వేవ్ వచ్చేలోపు వచ్చేస్తాయా..

కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా సినిమా రంగ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. చిన్న చిత్రాలు ఓటిటి వేదికల్ని వెతుక్కుంటున్నాయి.

8 జిల్లాల్లో ఏపీలో కర్ఫ్యూ సడలింపు.. కొత్త నిబంధనలు ఇవే!

సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతుండడంతో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధలని సడలిస్తూ ఆయా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి.

డ్యామేజ్ అయిన ఎడమ కన్ను.. కత్తి మహేష్ కోసం ఫండ్ రైజింగ్

నటుడు, ప్రముఖ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ శనివారం ఉదయం కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే.

భర్తతో కాజల్ లాంగ్ డ్రైవ్.. ప్లానింగ్ లేకుండా కారెక్కారు!

గత ఏడాది కాజల్ అగర్వాల్ వివాహబంధంలోకి అడుగుపెట్టింది.

ఐదేళ్లుగా సహజీవనం.. నయనతార ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే..

ప్రస్తుతం ఇండియాలో హాటెస్ట్ కపుల్స్ లో నయనతార, విగ్నేష్ శివన్ జంట ఒకటి. వీరిద్దరూ 2015 నుంచి సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.