వల్లభనేని వంశీ ఫోన్ మాయం


Send us your feedback to audioarticles@vaarta.com


గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడికి సంబంధించి సత్యవర్థన్ అనే వ్యక్తి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అతడ్ని కిడ్నాప్ చేశారనే ఆరోపణలపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతడి మొబైల్ ఫోన్ కీలకం కాగా, అది కాస్తా మాయమైంది.
హైదరాబాద్ వెళ్లిన విజయవాడ పోలీసులు, వంశీ నివాసంలోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ టైమ్ లో వంశీ సెల్ ఫోన్ పోలీసులకు కనిపించలేదు. ఇదే విషయాన్ని కోర్టుకు విన్నవించారు. వంశీ ఫోన్ ను స్వాధీనం చేసుకునేందుకు కోర్టు అనుమతి కోరారు. ఒకవేళ కోర్టు అనుమతిస్తే, స్వయంగా వంశీ తన ఫోన్ ను పోలీసులకు అప్పగించాల్సి ఉంటుంది.
మరోవైపు వంశీ వ్యక్తిగత సహాయకుడి ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఈ గ్యాప్ లో వంశీ ఫోన్ కూడా దొరికితే కేసు మొత్తం ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వంశీ, వాట్సాప్ కాల్స్ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫోన్ కు సంబంధించిన ఐపీడీఆర్ వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు. కోర్టు రిమాండ్ విధించిన తర్వాత విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. ఆయనకు ఖైదీ నంబర్ 7641ను కేటాయించారు. మిగిలిన వాళ్లతో కలవకుండా ఆయనకు సింగిల్ సెల్ కేటాయించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com