పీరియాడికల్‌ ప్రేమకథలో పూజ, రష్మిక

  • IndiaGlitz, [Wednesday,December 02 2020]

స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ సంపాదించుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం రాధేశ్యామ్‌, మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించనుంది. నెక్ట్స్‌ మూడు బాలీవుడ్ సినిమాల్లో నటించాల్సి ఉంది. మరి తెలుగు సినిమాల నటించదా!.. అంటే నటిస్తుందనే చెప్పాలి. పూజా హెగ్డే తదుపరి చిత్రం త్రిషాచిత్రం. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లో రూపొందనుంది. ప్రియాంక దత్‌, స్వప్నా దత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే.. ఈ చిత్రంలో పూజా హెగ్డేతో పాటు రష్మిక మందన్న కూడా హీరోయిన్‌గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. 1964 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. ఇందులో దుల్కర్‌ సల్మాన్‌ రామ్‌ అనే సైనికుడిగా నటిస్తున్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. 'యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ' అనే క్యాప్ష‌న్ ఇవ్వ‌డంతో సినిమాలోని ఇన్‌టెన్స్‌ను అర్థం చేసుకోవ‌చ్చు.

కేవ‌లం మ‌ల‌యాళ సినిమాల‌కే ప‌రిమితం కాకుండా విల‌క్ష‌ణమైన పాత్ర‌లు చేయ‌డానికి కూడా దుల్క‌ర్ ఆస‌క్తి చూపుతుండ‌టంతో ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల‌కు మాత్రం కీర్తిసురేశ్‌తో వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్నా సినిమా నిర్మించిన మ‌హాన‌టితోనే ద‌గ్గ‌ర‌య్యారు. ఈ చిత్రంలో జెమినీ గ‌ణేశ‌న్ పాత్ర‌లో దుల్క‌ర్ మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ‘అందాల రాక్ష‌సి, ప‌డిప‌డి లేచె మ‌న‌సు’ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిని తెరకెక్కించనున్నారు.